పవన్ కు షాక్ ఇచ్చిన జనసేన ఎమ్మెల్యే…!

-

జనసేన పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ షాక్ ఇచ్చారు. మూడు రాజధానుల ప్రతిపాదనకు ఆయన మద్దతు ఇచ్చారు. వివరాల్లోకి వెళితే గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ రాజధాని ప్రాంత రైతులకు మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై ఆయన ఆరోపణలు చేయడమే కాకుండా పోలీసులు అడ్డుకున్నా సరే రాజధాని ప్రాంతంలో పర్యటించారు.

పోలీసులు అడ్డుకున్నా ముళ్ళ కంచెలు వేసినా సరే పవన్ మాత్రం వాటిని దాటుకుని పొలాల్లో నుంచి వెళ్లి మరీ రైతులకు మద్దతు ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఆయనకు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఊహించని షాక్ ఇచ్చారు. ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానుల ప్రతిపాదనకు ఆయన మద్దతు ఇస్తూ తాజాగా ప్రభుత్వానికి అనుకూలంగా మరోసారి అభినందిస్తూ వ్యాఖ్యలు చేసారు.

సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళలా కనపడుతున్నాయని, మూడు రాజధానుల ప్రతిపాదనకు తాను అంగీకారం తెలుపుతున్నా అని దాని ద్వారా అభివృద్ధి జరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేయడం గమనార్హం. ఇప్పటికే ఆయన పార్టీకి దూరంగా ఉన్నారు. ఈ తరుణంలో రాపాక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలాతో జనసేన శ్రేణులు ఒక్కసారిగా కంగుతిన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news