శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

-

శనివారం తెల్లవారుజామున శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మందస కొత్తపల్లి బ్రిడ్జి వద్ద కారు అదుపు తప్పి పంటకాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలోఓకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. నలుగురు మృతదేహాల్ని వెలికితీశారు. మరో ఇద్దరి కోసం కాలువలో గాలిస్తున్నారు. డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు.

దీంతో అతడ్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబం సింహాచలం నుంచి ఒడిశాలోని బరంపురుంకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news