ఒలింపిక్స్ : మెడల్ మిస్.. మరో 4వ స్థానం..!

-

ఒలింపిక్స్ లో భారత్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోతుంది. టోక్యోకు మించిన ప్రదర్శన చేయాలి అనుకుంటే ఆ దరిదాపులోకి కూడా వెళ్లడం లేదు. ఇప్పటివరకు భారత్ కు మూడు కాంస్య పతకాలు సాధించగా.. అవి కూడా షూటింగ్ లో రాగ మరో పతకం వస్తుంది అని అభిమానులు ఆశించారు. స్కీట్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫికేషన్ లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పోరుకు అర్హత సాధించిన భారత జట్టు నాలుగో స్థానంలో సరిపెట్టుకుంది.

చైనాతో పోటా పోటీగా జరిగిన ఈ కాంస్య పోరులో భారత్ ఓటమి చవి చూసింది. మొత్తం ఈ మ్యాచ్ లో 48 పాయింట్స్ కు గాను చైనా షూటర్లు 44 పాయింట్స్ సాధించి కాంస్య పతకం పట్టుకొల్లరు. కానీ భారత షూటర్లు 48 పాయింట్స్ కు గాను 43 పాయింట్స్ మాత్రమే సాధించడంతో ఒక్క పాయింట్ తో భారత షూటర్లు చౌహాన్ మహేశ్వరి, నరుకా అనంత్ జీత్ సింగ్ మెడల్ మిస్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news