రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనుకున్న చోట కేటీఆర్ తండ్రి విగ్రహం పెట్టాలనుకుంటున్నారా..? : సీఎం రేవంత్ రెడ్డి

-

రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలనుకున్న చోట కేటీఆర్ తండ్రి విగ్రహం పెట్టాలనుకుంటున్నారా..? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా తాజాగా సోమాజీగూడలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తొలగిస్తామని కొందరూ సన్నాసులు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. మీకు చేతనైతే ఆ విగ్రహాన్ని టచ్ చేయండి.. అంతు చూస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

దాదాపు పదేళ్లు అధికారంలో ఉన్న మీరు.. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. పదేళ్లలో ఏనాడు విగ్రహం పెట్టాలనే ఆలోచన రాని వాళ్లకు ఇవాళ ప్రశ్నించే నైతికత లేదన్నారు. వచ్చే డిసెంబర్ 09 లోపు తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసిన తరువాత.. ఏ రోజు తొలగిస్తారో చెబితే తాము కూడా వస్తామని విమర్శించారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముట్టుకోకముందే ఏమవుతుందో చూపిస్తామని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news