ఈ నెల 23న అన్నమయ్య జిల్లా పర్యటనకు పవన్‌ కళ్యాణ్‌

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లా రాజంపేట పర్యటన ఖరారు అయింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 23న అన్నమయ్య జిల్లా పర్యటన ఉంటుంది. రైల్వే కోడూరు నియోజకవర్గం మైసూరా వారి పల్లి లో గ్రామసభ నిర్వహించనున్నారు. అనంతరం రాజంపేట అన్నమయ్య డ్యాం వరద బాధిత ప్రాంతం పులపుత్తూరులో మధ్యాహ్నం 12:45 గంటలకు పర్యటన ఉంటుంది.

Pawan Kalyan will visit Annamaiya district on 23rd of this month

మధ్యాహ్నం 1: 45 గంటలకు రాజంపేట ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో విడిది కూడా ఉండనుంది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గం వెంబడి ప్రయాణం చేసి ఈ కార్యక్రమాలలో పాల్గొననున్నారని అధికారులు ప్రకటించారు. ఇక విడిది అనంతరం రేణిగుంట విమానాశ్రయం చేరుకొని గన్నవరం చేరుకోనున్నారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..ఈ మేరకు పర్యటన ఖరారు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news