అమ‌రావ‌తి సభలో సరదా సన్నివేశం.. మహిళ భర్తకు ఫోన్ చేసిన చంద్ర‌బాబు..

-

రాజధాని అమరావతిని నిర్వీర్యం చేసే ప్రయత్నాల్లో, ప్రభుత్వం ఉండటంతో, ఇప్పటికే 19 రోజుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. రోజులు గడిచే కొద్దీ ఉద్యమం ఉదృతం అవుతుంది. ఇదిలా ఉంటే.. తుళ్లూరులో చంద్రబాబు పాల్గొన్న సభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అమరావతి కోసం అంతా తరలిరావాలని చంద్రబాబు పిలుపునిస్తున్న తరుణంలో సమావేశానికి నాగలక్ష్మీ అనే మహిళ వచ్చింది. తన ఉంగరాన్ని అమరావతి జేఏసీకి విరాళంగా అందించింది. అయితే తాను ఇంట్లో చెప్పకుండా ఈ సమావేశానికి వచ్చానని.. తన భర్తకు ఫోన్ చేసి మీరే చెప్పాలని చంద్రబాబును కోరింది.

దీంతో.. నీ భర్తకు నేను చెబుతానని చంద్ర‌బాబు భరోసా ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే నాగలక్ష్మీ నుంచి ఆమె భర్త చంద్రశేఖర్ ఫోన్ నంబర్ తీసుకున్న చంద్రబాబు.. వెంటనే అతడికి ఫోన్ చేశారు. చెల్లెమ్మ మీకు చెప్పకుండా ఈ మీటింగ్‌కు వచ్చిందని ఆమెను ఏమీ అనొద్దని చంద్రశేఖర్‌కు సూచించారు. మీరు కూడా ఈ ఆందోళనకు మద్దతు ఇవ్వాలని కోరారు. చంద్రబాబు హఠాత్తుగా ఫోన్ చేయడంతో సంతోషపడ్డ చంద్రశేఖర్… తాను కూడా అమరావతి పోరాటానికి తనవంతు సహకారం అందిస్తానని చంద్రబాబుకు హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news