నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

-

నల్గొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన దామరచర్ల మండలం బొత్తుల పాలెం వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. ఆగి ఉన్న బొలెరోను డీసీఎం వాహనం వేగంగా దూసుకొచ్చి ఢీకొని బొల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి.

మృతులు దేవరకొండకు చెందిన యాది, రిజ్వాన్‌గా పోలీసులు గుర్తించారు. గాయపడిన వ్యక్తిని దగ్గరలోని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. టాటా నెట్వర్క్‌కు చెందిన నలుగురు కార్మికులు కేబుల్ పనులు చేస్తుండగా డీసీఎం వాహనం వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డీసీఎం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news