వైసీపీ కి షాక్.. టీడీపీ లోకి మాజీ మంత్రి..?

-

ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం విధితమే. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోరా పరాజయం చవిచూసింది. కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో ప్రతిపక్ష హోదా కూడా పొందలేకపోయింది. దీంతో పార్టీ నేతలు అసహనానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో పలువురు పార్టీ నేతలు పార్టీకి రాజీనామా చేసారు. ఇప్పటికే వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి.

తాజాగా వైసీపీకి మరో కీలక నేత, మాజీ మంత్రి గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు వైసీపికి రాజీనామా చేసిన అనంతరం సీఎం చంద్రబాబును కలవాలని చూసినా అది సాధ్యపడటం లేదు. వరద బాధితులకు తాజాగా రూ.50 లక్షల విరాళం అందించేందుకు ఆయన సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు అన్నీ విషయాలు తనకు తెలుసు అని త్వరలో ఓసారి మాట్లాడుదామని శిద్దాతో చెప్పారని టాక్ వినిపిస్తోంది. టీడీపీలో ఆయన చేరేందుకు లైన్ క్లియర్ అయిందని శిద్దా వర్గీయులు చెప్పుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news