మా మూడు పార్టీల కలయిక శాశ్వతంగా ఉండాలి : చంద్రబాబు

-

మేం ప్రతిపక్షంలో ఉండగా.. ఎన్నో విమర్శలు చేశాం. కానీ అధికారంలోకి వచ్చాక చూస్తే.. గత పాలకులు ప్రభుత్వాన్ని నడిపిన తీరు చూసి చాలా ఆశ్చర్యమేస్తోంది. ఇంతటి దారుణంగా వ్యవహరిస్తారా..? అని అనిపించింది అంటూ ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాజకీయాల్లో మొట్టమొదటిసారిగా 93 శాతం స్ట్రైక్ రేట్.. 52 శాతం ఓటింగ్ ఎప్పుడూ లేదు. ఎప్పుడూ రానటువంటి విజయం 2024 ఎన్నికల్లో వచ్చింది అని అన్నారు సీఎం.

అలాగే మూడు పార్టీలు అనుసరించిన విధానం.. ఏ చిన్నపొరపాటు జరగ్గకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. పనులు చేయడం ఎంత ముఖ్యమో.. ప్రవర్తన కూడా అంతే ముఖ్యం. ప్రజామోదం ఉండాలంటే వారు మెచ్చుకునేలా పని చేయాలి అన్నారు. ఇక మూడు పార్టీల కలయిక శాశ్వతంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అని చంద్రబాబు తెలిపారు. మా మూడు పార్టీలు.. మూడు రకాల స్వభావాలు.. కానీ ఒకటే ఆలోచన. కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి చెప్పాలి.. కేంద్ర పథకాల అనుసంధానం గురించి చెప్పాలి

Read more RELATED
Recommended to you

Latest news