దేవుడిని నమ్మండి.. చంద్రబాబు కుట్రలు కాదు : పోసాని

-

డిక్లరేషన్ వివాదం పై పోసాని  కృష్ణమురళీ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ తిరుమల కొండకు వెళ్లడానికి డిక్లరేషన్ ఇవ్వాలని చంద్రబాబు పేర్కొంటున్నాడని.. కొండపైకి వెళ్లడానికి జగన్ అఫిడవిట్ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. ఏ ఉద్దేశంతో జగన్ ని టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఓట్ల కోసం ఏ అఫిడవిట్ లేకుండా ముస్లిం, క్రిస్టియన్ల ఇంటికి వెళ్తారు. అప్పుడు ఎవరికైనా అఫిడవిట్ ఇఛ్చారా..? చంద్రబాబు అంటూ ప్రశ్నించారు పోసాని. 

ఢిల్లీకి వెళ్లి మోడీ, అమిత్ షా కాళ్లు పట్టుకున్న ఫొటోలు చూశామన్నారు. చంద్రబాబు హిందూ ధర్మ పరిరక్షకుడు అంట.. మోడీ అంటే కేడీ.. కేడీ అంటే మోడీ అని చంద్రబాబు తిట్టాడు. బాబు లాంటి వ్యక్తి వస్తాడనే అంబేద్కర్ చాలా బలమైన రాజ్యాంగం రాశాడు. జగన్ ఏం పాపం చేశాడని ఆయనను హింసిస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు తిరుమలను నాశనం చేయాలని చూస్తున్నాడని.. భక్తులు తెలుసుకోవాలన్నారు. దేవుడిని నమ్మండి.. చంద్రబాబు కుట్రలను కాదు సూచించారు పోసాని కృష్ణమురళి. చంద్రబాబు దేవుడి కంటే అతీతుడా..? తిరుమలకు రావద్దడనాకి చంద్రబాబు ఎవరు అని ప్రశ్నించారు. 

Read more RELATED
Recommended to you

Latest news