నాగర్ కర్నూల్ లో బుల్డోజర్ రాజకీయం : మర్రి జనార్ధన్ రెడ్డి

-

రాష్ట్రంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలో ఒక బుల్డోజర్ రాజకీయం నడుస్తుంది అని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి తెలిపారు. నాగర్ కర్నూల్ లో ఈ తొమ్మిది నెలల్లో ఒక అభివృద్ధి పనికి కూడా జరగలే. అనుభవం లేనీ ఎమ్మెల్యే, సగం సగం అనుభవం ఉన్న ఎమ్మెల్సీ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు. నాతో అభివృద్ధిలో పోటీ పడమంటే మా కార్యకర్తలను అరెస్టు చేపిస్తుండు. 9 నెలల్లో తొమ్మిది మందినీ అరెస్టు చేపించిండు అన్నారు.

అదే విధంగా గణేష్ నిమజ్జనంలో జరిగిన సంఘటనలో కేవలం మా కార్యకర్తపైనే కేసు పెట్టించిండు. ఈ ఎమ్మెల్యే అరెస్టులతో మా కార్యకర్తలని లొంగదీసుకోవాలని చూస్తుండు అని కూచకుళ్ల రాజేష్‌రెడ్డి పై ఆరోపణలు చేసాడు జనార్ధన్ రెడ్డి. ఇక కొత్తగా ఏర్పడిన మీ ప్రభుత్వ పాలన కోసం ఏడాది అవకాశం ఇచ్చాం. మేము రాజకీయం చేస్తే వచ్చే డిసెంబర్ 9 తర్వాత ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇద్దరు తిరగరు అని పేర్కొన్నారు జనార్ధన్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news