ప్రకాష్ రాజ్ మరో ట్వీట్.. పవన్ కళ్యాణ్ కి మరో కౌంటర్

-

సినీ నటుడు ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్స్ తో హాట్ టాపిక్ అయ్యారు. తిరుమల లడ్డు వివాదం ఎప్పుడైతే మొదలైందో అప్పటినుండి ప్రకాష్ రాజ్ – ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తూనే ఉంది. పవన్ కళ్యాణ్ దేవుడిని రాజకీయాలలోకి లాగాడంటూ తనకు సమయం దొరికినప్పుడల్లా విమర్శిస్తున్నారు ప్రకాష్ రాజ్.

ఇక గురువారం తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సభలో సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ సుదీర్ఘ ప్రసంగం ఇచ్చిన విషయం తెలిసిందే. సనాతన ధర్మ పరిరక్షణ కోసం కేంద్రానికి పలు సూచనలు చేస్తూ డిక్లరేషన్ ని విడుదల చేశారు పవన్ కళ్యాణ్. ఇతర మతాలను కించపరిస్తే నటులు, చిత్ర పరిశ్రమ, వ్యాపారులు అందరూ మాట్లాడతారని.. కానీ సనాతన ధర్మంపై దాడులు జరిగితే ఒక్కరు స్పందించరని ఆరోపించారు.

సనాతన ధర్మంపై దాడులు జరిగితే ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా ధైర్యంగా గొంతు విప్పాలని కోరారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి ఆయనని ఉద్దేశిస్తూ పరోక్షంగా ట్వీట్ చేశారు. ” సనాతన ధర్మ రక్షణలో మీరు ఉండండి. సమాజ రక్షణలో మేముంటాం. జస్ట్ ఆస్కింగ్ ” అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news