టాలీవుడ్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం

-

tollywood rajendra prasad daugter died: టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇప్పటికే చాలామంది ప్రముఖ నటీనటులు… వివిధ కారణాల వల్ల మరణించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. కమెడియన్ రాజేంద్రప్రసాద్ కూతురు గద్దె గాయత్రి… మరణించారు. ఆమె గుండెపోటుతో మరణించినట్లు చెబుతున్నారు. 38 సంవత్సరాల గద్దె గాయత్రి… శుక్రవారం రాత్రి గుండెపోటునకు గురైనట్లు సమాచారం.

tollywood rajendra prasad daugter died

ఈ తరుణంలోనే కుటుంబ సభ్యులు గాయత్రిని హైదరాబాద్లోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు. అయితే… వైద్యులు ఆమెకు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆమె శనివారం ఉదయం పూట మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇవాళ గాయత్రి అంతక్రియలు జరగనున్నాయి. కాగా రాజేంద్రప్రసాద్ కు ఒక కొడుకు అలాగే ఒక కూతురు ఉన్న సంగతి మనందరికీ.. తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news