తిరుమల అన్నదాన కేంద్రంలో పెరుగన్నంలో జెర్రీ..!

-

తిరుమలలో లడ్డు కల్తీ జరిగిందని గత కొద్ది రోజుల నుంచి వాదం తలెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదం పై ప్రపంచ వ్యాప్తంగా చర్చించుకోవడం గమనార్హం. తిరుమలలో జరిగిన ఈ వివాదం గురించి మరిచిపోకముందే మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

తాజాగా తిరుమల అన్నదాన కేంద్రంలో పెరుగు అన్నంలో జెర్రీ దర్శనమిచ్చింది. టీటీడీ మాధవ నిలయం అన్నదాన కేంద్రంలో భోజనం చేస్తున్న ఓ భక్తుడి ఆకులో జెర్రీ కనిపించడం భయాందోళనకు గురయ్యాడు. అన్న ప్రసాదంలో జెర్ర కనిపించడంతో టీటీడీ యాజమాన్యాన్ని భక్తులు ప్రశ్నించారు. టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యం వ్యవహరించడం వల్లనే ఈ ఘటన జరిగిందని భక్తులు వాపోయారు. టీటీడీ సిబ్బంది మాత్రం నిర్లక్ష్యపు సమాధానం చెప్పడమే కాకుండా మమ్మల్ని వెళ్లిపోమంటున్నారని భక్తులు వాపోయారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేశారు. ఇవాళ ఉదయమే భక్తులతో నడవడిక, అన్నదానం పై టీటీడీ అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ఇంతలోనే ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news