విద్యార్థులు, గురువుల ముందు కేసీఆర్ ని విమర్శించడమే మీ విధానామా..? : సబితా ఇంద్రారెడ్డి

-

విద్యార్థులు, గురువుల ముందు కేసీఆర్ ని విమర్శించడమే మీ విధానామా..? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాను మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే  సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. తాజాగా ఆమె ట్విట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై  స్పందించారు. గడిచిన పది నెలలలో కేసీఆర్ గారి పేరు ఎత్తకుండా ఒక్క సభలో అయినా మాట్లాడారా ? మాట్లాడేటప్పుడు అది ప్రభుత్వ కార్యక్రమమా లేక పార్టీ కార్యక్రమమా అని ముఖ్యమంత్రి  మర్చిపోతున్నారు. మీరు ఇచ్చాం అని చెబుతున్న టీచర్ పోస్టులు కేసీఆర్ మంజూరు చేసినవి కావా..? అని ప్రశ్నించారు.

హైయర్ ఎడ్యుకేషన్‌‌లో 3202 పోస్టులు, యూనివర్సిటీ లో 1081 పోస్టులు కేసీఆర్  ప్రభుత్వం మంజూరు చేసినవి కావా? ఇంటర్, టెక్నికల్ మరియు కాలేజియేట్ ఎడ్యుకేషన్ సంబంధించి 3896 కాంట్రాక్టు ఉద్యోగులను కేసీఆర్  రెగ్యులర్ చేశారు అని చెప్తే బాగుండేది. ఎన్నికల ముందు మీరు చెప్పిన 25,000 టీచర్ పోస్టులు ఎందుకు ఇవ్వలేదు అని ఆ గురువుల ముందు చెప్తే బాగుండేది. ఎన్నికలప్పుడు 6000 పాఠశాలలు మూత పడ్డాయి అని అబద్దం చెప్పిన మీరు, ఆ పాఠశాలల లిస్ట్ విడుదల చేస్తే బాగుండేది. “మన ఊరు మన బడి” కార్యక్రమం ఎందుకు ఆపేసారో చెప్తే బాగుండేది. 6 లక్షల మంది పేద విద్యార్థులు చదువుతున్న కేసీఆర్  ప్రవేశ పెట్టిన గురుకులాలను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేద్దాం అనుకుంటున్నది అని చెప్తే బాగుండేది. ప్రభుత్వ పాఠశాలలో “బ్రేక్ ఫాస్ట్ స్కీమ్” ఎందుకు ఆపేశారో చెప్తే బాగుండేది అని సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news