అబద్దపు ప్రచారాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కేటీఆర్.. కాంగ్రెస్ ఆసక్తికర ట్వీట్..!

-

అబద్దపు ప్రచారాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కేటీఆర్ అంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. గురువారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా  ఆసక్తికర పోస్ట్ చేసింది. ముఖ్యంగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ పేరుతో ఫాక్స్ కాన్ కంపెనీ వెళ్లిపోతుంది అంటూ ఫేక్ ప్రచారం చేశారని.. డీకే కేసు ఫైల్ చేయడంతో తోక ముడిచారని, మళ్లీ తమిళనాడుకు వెళ్తుంది అంటూ ప్రచారం చేశారని తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి చొరువతో ఫాక్స్ కాన్ కంపెనీ తెలంగాణలో మరింత విస్తరించే ఆలోచనలు చేస్తుండటంతో మల్లీ తోక ముడిచారని విమర్వించింది. దామగుండం రాడార్ కేంద్రం గత ప్రభుత్వంలో 2017లో అనుమతులు ఇచ్చారని.. మళ్లీ అప్పుడు కొత్త నాటకాలకు తెర లేపుతున్నారని వెల్లడించింది.

అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు, ఆక్రమణలు కూల్చేయాలని ఆదేశించారు. మళ్లీ ఇప్పుడు కూల్చివేతలు ఆపాలని మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించింది కాంగ్రెస్. కేసీఆర్ కుంగిపోయే కాళేశ్వరం కట్టించి లక్ష కోట్ల ప్రజాధనం వృధా చేశారని, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలో భారీగా కమీషన్లు దండుకున్నారని ఆరోపించింది. అన్ని జిల్లా కార్యాలయాల్లో బీఆర్ఎస్ పార్టీకి భూములు కేటాయించి కోట్ల రూపాయలతో బిల్డింగ్ లు కట్టించారని తెలిపింది. బీఆర్ఎస్ చేసిన 7లక్షల కోట్లకు పైగా అప్పును.. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి వారసత్వంగా ఇచ్చారని.. చేసిన అప్పులకు నేడు మిత్తీలు కట్టడమే సరిపోతుంది అంటూ  తెలిపింది తెలంగాణ కాంగ్రెస్. 

Read more RELATED
Recommended to you

Latest news