IND Vs NZ : టీమిండియా విఫలం.. నలుగురు డకౌట్..!

-

న్యూజిలాండ్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా విఫలం చెందిందనే చెప్పాలి. ముఖ్యంగా ముగ్గురు కీలక ఆటగాళ్లు డకౌట్ కావడం గమనార్హం. విరాట్ కోహ్లీ, సర్పరాజ్ ఖాన్, కే.ఎల్. రాహుల్, రవీంద్ర జడేజా వీరు నలుగురు కూడా ఇవాళ డకౌట్ అయ్యారు. వీరిలో విరాట్ కోహ్లీ, సర్పరాజ్ ఖాన్, కే.ఎల్. రాహుల్, ముగ్గురు కూడా ఒకప్పుడు ఆర్సీబీ ప్లేయర్ కావడం విశేషం. వీరితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 2 పరుగుల వద్దనే ఔట్ అయ్యాడు.

టీమిండియా 34/6 పీకల్లోతు కష్టాల్లో పడిందనే చెప్పాలి. ప్రస్తుతం రిషబ్ పంత్(15), రవిచంద్ర అశ్విన్  క్రీజులో ఉన్నారు.  పంత్-జైస్వాల్ కొద్ది సేపటి వరకు వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. అంతలోనే ఓపెనర్ జైస్వాల్ ఔట్ అయ్యాడు. ఆ వెంటనే వచ్చిన కే.ఎల్.రాహుల్ 5 బంతులు ఆడి డకౌట్ గా వెనుదిరిగాడు. ఆ వెంటనే వచ్చిన జడేజా కూడా డకౌట్ కావడం గమనార్హం.  న్యూజిలాండ్ బౌలర్లు బంతులతో నిప్పులు చెరుగుతున్నారు. వర్షం రావడం వారికి కలిసి వచ్చిందనే చెప్పాలి. భారత బౌలర్లకు అంతగా కలిసిరాదని కొందరూ ఎక్స్ పర్ట్స్ పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news