ఎక్కడికి రమ్మన్నా వస్తా.. కేసీఆర్ కి సీఎం రేవంత్ రెడ్డి సవాల్..!

-

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తాజాగా ఆయన సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ నీ నియోజకవర్గానికి వస్తా.. రా నువ్వు కూడా.. రచ్చబండ నిర్వహిద్దాం. ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వస్తాను.  కొండపోచమ్మ, మల్లన్నసాగర్,  రంగనాయకసాగర్, కిష్టాపూర్, వేముల ఘాట్  ఎక్కడికి రమ్మన్నా వస్తానని సవాల్ విసిరారు. ఇది మూసీ సుందరీకరణ కాదు.. ప్రక్షాళన అన్నారు.

మూసీకి పునరుజ్జీవనం అందిస్తాం అన్నారు. అద్దాల మేడల కోసం, అందాల బామల కోసం మేము పని చేయడం లేదు. దుబాయ్ వెళ్లి సుందకరణ కోసం గుండు మీద జుట్టు పెంచుకోవడం కోసం మేము పని చేయడం లేదన్నారు. అలాంటి పాలకుల నిర్లక్ష్యం వల్ల మూసీ నది మురికి కుంపంగా మారిందని తెలిపారు. వేములఘాట్, మల్లన్నసాగర్ ఒక్క ఇండ్లు అయినా ఇచ్చారా..? అని ప్రశ్నించారు. వయనాడ్ పరిస్థితి ఏమైందో తెలియదా..? మూసీ వల్ల మాకు ఆర్థిక ప్రయోజనం ఏమైనా ఉందా..? మూసీలో ఉన్న మురికి కంటే.. మీ మెదళ్లలో విషం నింపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news