శాసనమండలిలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. రోడ్లు, విద్యుత్ పై అధికార పక్షాన్ని ప్రతిపక్షం నిలదీసింది. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై ప్రతిపక్ష సభ్యుడు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇందుకు మంత్రి అచ్చెన్నాయుడు స్పందించి బదులిచ్చారు. దీంతో ఇద్దరి మధ్య వాడీ వాడీగా చర్చ జరిగింది. పరస్పరం ప్రశ్నలు సంధించుకున్నారు.
ముఖ్యంగా బడ్జెట్ పై ఎమ్మెల్సీ బొత్స విమర్శలు కురిపించారు. హామీలు నెరవేర్చేందుకు అరకొరగా నిధులు కేటాయించారని బొత్స వ్యాఖ్యానించారు. సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లుగా మారుస్తామన్నారని, శ్రీకాకుళంలో రోడ్లు బాగులేవని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో రోడ్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దామా అని బొత్స సవాల్ విసిరారు. ఏ జిల్లాలో ఏ రోడ్డు వెళామో తమరే సెలక్ట్ చేయండని బొత్సకు అచ్చెన్న కౌంటర్ ఇచ్చారు. రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చేందుకు గత ఐదేళ్లలో ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని అచ్చెన్న నిలదీశారు.