తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముసలోడు అయ్యాడని… వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ లేదని నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ అలాగే కవిత పోటీ చేసిన కూడా ఓడిపోతారని చురకలాంటించారు.

హరీష్ రావు ను సిద్దిపేటలో ఓడించడం చాలా కష్టమని… ఆయన సిద్దిపేట వదిలేస్తే ఓడిపోవడం పక్క అంటూ.. బాంబు పేల్చారు ధర్మపురి అరవింద్. అలాగే అల్లు అర్జున్ నటించిన పుష్ప లోని రప్పా రప్పా డైలాగ్ కొట్టి మరి వార్నింగ్ ఇచ్చారు. కెసిఆర్, ఆయన కొడుకు కేటీఆర్, కవిత అలాగే హరీష్ రావు లను గపా గపా గుద్ది… రప్పా రప్పా అనుకుంటూ జైల్లో వేయాలని డిమాండ్ చేశారు. కెసిఆర్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు స్కామ్ చేశారని ఫైర్ అయ్యారు. అందుకే వాళ్ళని జైల్లో వేయాలని.. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బిజెపి ఎంపీ అరవింద్.