కరెక్ట్ టైం లో బాలీవుడ్ లో సినిమాలు ఒప్పుకున్న పూజా హెగ్డే …అంటున్న మాటలో నిజమెంత ..?

-

పూజా హెగ్డే 2014 లో ఒకేసారి రెండు తెలుగు సినిమాలో అవకాశం దక్కించుకున్న హీరోయిన్. ముంబై లో మోడలింగ్ చేస్తూన్న పూజా హెగ్డే కి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ డెబ్యూ సినిమా ముకుంద సినిమాలో అవకాశం వచ్చింది. అదే సినిమా తో పాటు అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమాలోను నటించింది. ఈ రెండు సినిమాలు రెండు నెలల తేడా తో రిలీజైయ్యాయి. రెండు సినిమాలు మంచి హిట్ గా నిలిచాయి. ఈ రెండు సినిమాలతో పూజా హెగ్డే కి టాలీవుడ్ లో మంచి పేరు కూడా వచ్చింది. దాంతో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి.

 

అయితే అదే సమయంలో బాలీవుడ్ నుండి ఏకంగా హృతిక్ రోషన్ హీరోగా చారిత్రాత్మక సినిమా మొహంజాదారో లో అవకాశం వచ్చింది. దాంతో పూజా హెగ్డే తెలుగు సినిమాలన్ని కాదనుకొని బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. రెండేళ్ళు ఆ సినిమా కోసం కష్టపడింది. కానీ ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. దాంతో అక్కడ పూజా హెగ్డే ని పట్టించుకున్న వాళ్ళు కరువయ్యారు. అప్పుడే హరీష్ శంకర్ దువ్వాడ జగన్నాధం లో ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమాతో తెలుగులో సెటిలయిన పూజా హెగ్డే ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.

అయితే రీసెంట్ గా మళ్ళీ పూజా హెగ్డే కి బాలీవుడ్ నుంచి రెండు భారీ ప్రాజెక్ట్స్ నుంచి ఛాన్స్ వచ్చింది. వాటిలో ఒకటి సల్మాన్ ఖాన్ సినిమా కాగా రెండవది అక్షయ్ కుమార్ సినిమా. ఇప్పటికే ఈ రెండు సినిమాలకి సైన్ చేసింది పుజా హెగ్డే. అయితే నిన్నా మొన్నటి వరకు పూజా బాలీవుడ్ సినిమాలని ఒప్పుకొని మళ్ళీ రాంగ్ స్టెప్ వేస్తుందని అన్నారు. అయితే కరోనా కారణంగా అన్నీ చిత్ర పరిశ్రమలలో కష్ఠతరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారీగా రెమ్యూనరేషన్స్ కూడా తగ్గనున్నాయట. అంతేకాదు పూజా హెగ్డే లాంటి హీరోయిన్ ని తీసుకొని బడ్జెట్ పెంచుకొనే కంటే కొత్త వాళ్ళని అవకాశాలు ఇస్తే అన్ని విధాలా బెటర్ అన్న అభిప్రాయానికి వస్తున్నారట. దీంతో ఇప్పుడు పూజా బాలీవుడ్ లో సినిమాలు ఒప్పుకోవడమే కరెక్ట్ అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news