టాలీవుడ్ హీరోలకి ఛాయిస్ లా మారుతున్న పూరి హీరోయిన్ ..!

-

అనన్య పాండే … బాలీవుడ్ లో ఇప్పటికే రెండు సినిమాలు నటించింది. ఈ రెండు సినిమాలు ఫ్లాయ్యాయి. అయినా ఈ బ్యూటి హవా మామూలుగా లేదు. చేసిన రెండు సినిమాలైన గ్లామర్ పరంగా బాలీవుడ్ జనాలని విపరీతంగా ఆకట్టుకుంది. ఏకంగా పాన్ ఇండియా సినిమాలోనే ఛాన్స్ కొట్టేసింది. ఇది ఎంతమందికి సాధ్యం అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఫైటర్ అనే టైటిల్ అనుకుంటున్నారు. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్స్‌పై పూరీ, చార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 

ప్ర‌స్తుతం కొంత టాకీ పార్ట్ షూట్ చేసిన పూరి లాక్ డౌన్ కారణంగా బ్రేక్ ఇచ్చారు. తెలుగు, హిందీతో పాటు దక్షిణాది భాషలన్నింటిలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బాలీవుడ్‌ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. ప్యాన్‌ ఇండియా సినిమా కావటంతో ఈ సినిమాలో హీరోయిన్‌ బాలీవుడ్‌ బ్యూటి అయితే బిజినెస్‌ పరంగా కూడా ప్లస్ అవుతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్. అందులో భాగంగానే అనన్య పాండేను తీసుకున్నారు పూరి. ‘సాహో’ సినిమాలో విలన్ పాత్రలో నటించిన చుంకీ పాండే కూతురే అనన్య పాండే. గతేడాది బాలీవుడ్‌ వచ్చిన స్టూడెంట్‌ ఆఫ్‌ ద ఇయర్‌ 2 సినిమాతో వెండితెరకు పరిచయం అయిన అనన్య ఆ తర్వాత ‘పతి పత్ని ఔర్ వో’ సినిమాలో నటించింది.

ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టరయినా కూడా, బాలీవుడ్ మేకర్స్ తో పాటు, సోషల్ మీడియాలోను ఫాన్ ఫాలోయింగ్ విపరీతంగా సంపాదించుకుంది. అయితే ఇప్పుడు కొంతమంది టాలీవుడ్ హీరోల కన్ను అనన్య మీద పడిందట. అసలే పూరి హీరోయిన్ కావడంతో కొంతమంది యంగ్ హిరోలు అనన్య ని తమ సినిమాలో తీసుకోమని నిర్మాతలకి సూచిస్తున్నారట. చాలా మంది యంగ్ హీరోలకి అనన్య మంచి ఛాయిస్ అని మేకర్స్ కూడా ఫీలవుతున్నారట. ఒకవేళ లాక్ డౌన్ తర్వాత గన రెండు తెలుగు సినిమాలు పడితే నెక్స్ట్ ఇయర్ కి అనన్య టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయి అయ్యో అవకాశాలే ఎక్కువ అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news