సేంద్రీయ,సహజ వ్యవసాయానికి తేడాలేమిటో తెలుసా?

-

ఇప్పుడు చాలా మంది వ్యవసాయం వైపు మొగ్గు చూపిస్తున్నారు.. అంతేకాదు..కొత్త కొత్త పద్దతులను కూడా అనుసరిస్తున్నారు..ముఖ్యంగా సేంద్రీయ,సహజ వ్యవసాయానికి నాంది పలుకుతున్నారు., తెలంగాణాల్లో చాలా మంది ఈ సహజ వ్యవసాయ పద్ద తుల్ని ఆచరించి అద్భుత ఫలితాలను సాధిస్తున్నామని తమ అనుభవాలను పంచుకుంటున్నారు. వీరి వాదం ప్రకారం భూమిలో అన్నిరకాల పోషకాలు నిక్షిప్తమై ఉన్నాయనీ, వాటిని ఉపయోగపడేలా చేయగలిగితే బయటనుంచి రసాయనిక లేదా సేంద్రియ ఎరువుల్ని వేయాల్సిన అవసరం లేదని వారి అభి ప్రాయం. గోమూత్రం వంటి కొన్ని పదార్థాలను వాడటం ద్వారా అచేతనంగా ఉన్న పోషకాలు అందుబాటులోకి వస్తాయని వారి విశ్వాసం. ఎరువులు, పురుగు మందులు, శిలీంద్రనాశకాలు వాడకుండానే మంచి దిగుబడులను సాధించవచ్చని నిరూపిస్తున్నారు.

 

ఇకపోతే ఈ విధానం ద్వారా పండిస్తే తక్కువ ఖర్చు అవుతుంది., తెలంగాణాల్లో చాలా మంది ఈ సహజ వ్యవసాయ పద్ద తుల్ని ఆచరించి అద్భుత ఫలితాలను సాధిస్తున్నామని తమ అనుభవాలను పంచుకుంటున్నారు. వీరి వాదం ప్రకారం భూమిలో అన్నిరకాల పోషకాలు నిక్షిప్తమై ఉన్నాయనీ, వాటిని ఉపయోగపడేలా చేయగలిగితే బయటనుంచి రసాయనిక లేదా సేంద్రియ ఎరువుల్ని వేయాల్సిన అవసరం లేదని వారి అభి ప్రాయం. గోమూత్రం వంటి కొన్ని పదార్థాలను వాడటం ద్వారా అచేతనంగా ఉన్న పోషకాలు అందుబాటులోకి వస్తాయని వారి విశ్వాసం. ఎరువులు, పురుగు మందులు, శిలీంద్రనాశకాలు వాడకుండానే మంచి దిగుబడులను సాధించవచ్చని అంటున్నారు.. కొందరు మంచి ఫలితాలను అందుకుంటే మరి కొంత మంది సేంద్రీయ వ్యవసాయం వైపు పరుగులు పెడుతున్నారు…

ఈ వ్యవసాయం పశువుల పేడతో కలిసిన వ్యవసాయ వ్యర్థా లను, ఆకు, అలములతో కూడిన ప్రకృతి సిద్ధ వ్యర్థాలనుంచి తయారయ్యే హరిత ఎరువులను పట్టణ వ్యర్థాలతో తయారుచేసే కంపోస్టు ఎరువులను, నూనె తీసిన తవుడు, నువ్వులు, పల్లీలు వంటి పదార్థాలను సేంద్రియ వ్యవ సాయంలో వాడతారు. వాన పాములను విరివిగా పెంచుతూ, అవి సారవంతం చేసిన వర్మికంపోస్టుని ఎక్కువగా వినియోగిస్తారు.అంతేకాదు పశువుల మూత్రాన్ని కూడా నిల్వచేసి, వాటిని వివిధ రూపాల్లో చిలుకుతారు.

అయితే రసాయనిక ఎరువులను కీటక, శిలీంద్ర నాశక పదార్థాలను వాడరు. జీవన ఎరువులను, కీటకాలను, శిలీంద్రాలను పారద్రోలే వేపనూనె, ట్రైకోడెర్మా వంటి పదార్థాలను విరివిగా వాడతారు. అత్యవసర పరిస్థితుల్లోనే రసాయ నిక ఎరువుల్ని కీటక, శిలీంద్ర నాశకాలను వినియోగిస్తారు. సేంద్రియ పద్ద తుల్లో పండించే ఉత్పత్తుల ఉత్పత్తికి 95 శాతం పైగా సేంద్రియ పదార్ధాలనే వాడాలి. రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఐదు శాతానికి లోబడే వాడాలి అలాంటి పరిస్థితుల్లో ఉత్పత్తయిన వాటికే సేంద్రియ ఉత్పత్తుల ధృవీకరణ పత్రాలను పొందగలుగుతారు. కొండప్రాంతాల్లో రసాయనాల వాడకం చాలా తక్కువగా వాడతారు.. అందుకే ఈ రెండు పద్దతుల ద్వారా వ్యవసాయాన్ని చేస్తున్నారు..రెండు కూడా మంచి ఫలితాలతో ఆరోగ్యం కూడా..

Read more RELATED
Recommended to you

Latest news