మునగ సాగులో యాజమాన్య పద్ధతులు..

-

మునగసాగు తో అధిక ఆదాయాన్ని పొందవచ్చు.. అందుకే ఎక్కువ మంది రైతులు ఈ పంటను పండిస్తూ అధిక దిగుబడిని పొందుతున్నారు.ఈ పంట అన్ని నేలల్లో పండిస్తారు. 9 నుంచి 10 మీటర్ల ఎత్తును కలిగి ఉంటాయి.వేసవి ప్రారంభంలో పూతకు వస్తుంది. ఆగస్టు , సెప్టెంబరు మాసాల్లో గింజలను పాలిధిన్ సంచుల్లో గాని నేరుగా గాని పొలంలో విత్తుకోవాలి. బహువార్షిక రకాల్లో కొమ్మ కత్తిరింపులను జూన్ రెండవ వారం నుండి ఆగస్టు చివరి వరకు భూమిలో నాటుకోవచ్చు.

మునగ అ రకాలు..

దేశవాళీ రకాలు ఎక్కువగా సాగులో ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జాఫ్నా పికెఎం 1 రకాలు ఎక్కువగా సాగుచేస్తున్నారు. పికెఎం వార్షిక రకం మొక్క 4 నుండి 6 మీటర్ల ఎత్తు వరకు పెరిగి విత్తిన 170 రోజుల్లో పూతకు వస్తుంది. కాయ పొడవు 60 నుండి 70 సెం.మీ ఉంటుంది. మొక్కకు 32 కిలోల లేదంటే 225 కాయలు వస్తాయి. జాఫ్నా రకం విత్తనం బహువార్షిక రకం. కాయ పొడవు 60 నుండి 90 సెం.మీ ఉండి మెత్తని గుజ్జు, రుచికరంగా ఉంటుంది. రెండో సంవత్సరం నుండి కాపుకు వస్తుంది. విత్తే ముందు నేలను నాలుగైదు సార్లు దుక్కి దున్నాలి. మొక్కలు 60నుంచి 75 సెం.మీ ఎత్తు పెరిగాక మొక్కల చివర్లు తుంచివేయాలి.

50గ్రా.మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ వేసి నీరు పెట్టాలి. మొక్కలకు ఆరు నెలలక ఒకసారి, 9నెలలకు మళ్లీ ఒకసారి 100గ్రా. యూరియా, 50గ్రా. మ్యూరేట్‌ఆఫ్‌ పొటాష్‌ను వేసి నీరు పెట్టాలి. అంతరకృషి: మొక్కలు 60నుంచి 75 సెం.మీ ఎత్తు పెరిగాక మొక్కల చివర్లు తుంచాలి.అలాగే నీటి తడులకు సంబంధించి విత్తనాలు మొలకెత్తే వరకు ప్రతి 3 రోజులకు నీటితడి ఇవ్వాలి. తర్వాత 10నుంచి 15 రోజులకు ఒకసారి నీటితడి ఇవ్వాలి.

కాయతొలుచు ఈగ పూత దశలో ఆశించి పిందె దశలో కాయలోనికి ప్రవేశించి, లోపలి పదార్ధాన్ని తిని నాశనం చేయడం వల్ల కాయల ఆకారం మారిపోయి వంకరగా అవుతాయి. కాయతొలుచు ఈగ నివారణకు పూత దశలో లీటరు నీటికి ఫాసలన్‌ 2 మి.లీ కలిపి పిచికారీ చేయాలి. పిందె దశలో లీటరు నీటికి డైక్లోరోవాస్‌ను 1మి.లీ కలిపి మళ్లీ పిచికారీ చేయాలి. అవసరమైతే మరోసారి 25రోజులకు పిచికారీ చేయాలి. వేరు కుళ్లు, కాండం కుళ్లు వర్షాకాలంలో మురుగు నీరు పోయే సౌకర్యం లేని నేలల్లో ఎక్కువగా ఆశిస్తుంది. కాండం చుట్టూ ఉన్న బెరడు కుళ్లిపోయి, చెట్టు విరిగిపోతుంది. వేర్లు కూడా కుళ్లిపోయి చెట్టు చనిపోతుంది. నివారణకు మొక్కల మొదలు వద్ద 1గ్రా. కార్బండైజిమ్‌ లేదా 3గ్రా. డైథేన్‌ ఎం-45 ఒక లీటరు నీటికి కలిపిన ద్రావణం కానీ లేదా 1శాతం బోర్డోమిశ్రమంగానీ ముంపుగా తడపాలి..

ఇకపోతే నాటిన 8నుంచి 9 నెలలకు కాపుకొస్తాయి. మొదటి పంట మార్చి నుంచి జూన్‌ నెలలో రెండో పంట సెప్టెంబరు-అక్టోబరు నెలలో వస్తుంది. పంట పెరిగినపుడు మొక్కకు ప్రతి సంవత్సరానికి 500నుంచి 600 కాయల వరకు దిగుబడి వస్తుంది..ఇంకేదైనా సమస్యలు వుంటే వ్యవసాయ నిపునుల సలహా తీసుకోవడం మంచిది..

Read more RELATED
Recommended to you

Latest news