ఈ బిజినెస్‌ ఐడియాతో నెలకు రూ. లక్ష ఆదాయం..!!

-

తక్కువ పెట్టుబడితో ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా..? పెట్టుబడి తక్కువైనా ఆదాయం ఎక్కువస్తే అలాంటి వ్యాపారం చేయడంలో తప్పేంలేదు. అదే ఫ్లై యాష్ బ్రిక్స్ వ్యాపారం. బూడిదతో తయారు చేసిన ఇటుకలకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. రాబోయే కాలంలో దాని డిమాండ్ భారీగా పెరగబోతోంది. బిల్డర్లు ఇప్పుడు బూడిదతో చేసిన ఇటుకలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం 100 గజాల స్థలంతోపాటు కనీసం 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ వ్యాపారం ద్వారా మీరు ప్రతి నెలా కనీసం రూ. 1 లక్ష వరకు అర్జించవచ్చు.

ఇటుకలను ఎలా తయారుచేస్తారంటే..

ఈ ఇటుకలను పవర్ ప్లాంట్ల నుంచి బూడిద, సిమెంట్, రాతి ధూళి మిశ్రమం నుంచి తయారు చేస్తారు. ఇటుకల తయారీకి ఉపయోగించే మాన్యువల్ యంత్రాన్ని 100 గజాల స్థలంలో సౌకర్యవంతంగా అమర్చవచ్చు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు ఎక్కువ స్థలం అవసరం లేదు. యంత్రాన్ని నడపడానికి 5 నుండి 6 మంది వ్యక్తులు అవసరం. రోజుకు దాదాపు 3 వేల ఇటుకలు తయారవుతాయి. మీకు ఎక్కువ పెట్టుబడి పెట్టగల సామర్థ్యం ఉంటే, మీరు ఆటోమేటిక్ మెషీన్‌ను కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ యంత్రం ధర 10 నుంచి 12 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ముడిసరుకు కలపడం నుంచి ఇటుకల తయారీ వరకు యంత్రం ద్వారానే పనులు జరుగుతాయి.

ఆటోమేటిక్ యంత్రం గంటలోనే వెయ్యి ఇటుకలను చేస్తుంది. ఈ విధంగా మీరు ఒక నెలలో 3 నుంచి 4 లక్షల ఇటుకలను సులభంగా తయారు చేయవచ్చు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మట్టి లేని కారణంగా ఇటుకలు తయారు చేయడం లేదు. ఉత్తరప్రదేశ్, హర్యానా , పంజాబ్ నుంచి ఇక్కడికి ఇటుకలు దిగుమతి అవుతాయి. బూడిద, సిమెంటు, రాళ్లపొడితో తయారు చేసిన ఇటుకలను ఆయా ప్రాంతాల్లో విక్రయించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు మాన్యువల్ మెషీన్‌ను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా కూడా నెలకు 30 వేల వరకు ఇటుకలను తయారు చేయవచ్చు. కాబట్టి..మీకు ఆసక్తి ఉంటే..ఒకసారి ఈ బిజినెస్‌ వైపు దృష్టి పెట్టండి.

Read more RELATED
Recommended to you

Latest news