కాసులు కురిపిస్తున్న సీతాఫలం..బంజరు భూమిలోనూ 40 లక్షల ఆదాయం

-

ప్రస్తుతం సంప్రదాయ వ్యవసాయం కంటే హార్టీకల్చర్ వ్యవసాయమే ఎక్కువ లాభాలను తెస్తుంది. చాలామంది రైతులు ఇదే మంచిదని నమ్ముతున్నారు. కొందరు రైతులతో ఈ వ్యవసాయంతో లాభాలు గడిస్తున్నారు. ఓ రైతు సీతాఫలం సాగుతో లక్షల్లో సంపాదిస్తున్నాడు. వింటర్ సీజన్ వచ్చిందంటే సీతాఫలాలు వచ్చేస్తాయ్. ఆ పేరు వింటుంటేనే అందరికి నోరు ఊరిపోతుంది. తింటే టేస్టిగా ఉంటుంది. సీతాఫలంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఈ పండు తింటం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రజలు వీటిని కొనటానికి ఎక్కువ ఆసక్తి చూపడంతో డిమాండ్ కూడా పెరిగింది.

సీతాఫలాల్లో మన బాడీలో విష వ్యర్థాల్ని తరిమికొట్టే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఎంతో మేలు చేసే విటమిన్ C ఉంటుంది. విటమిన్ సీ గురించి మనం కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. అది ఇప్పుడు ఎంత ముఖ్యమో మనందరికి తెలిసిన విషయమే.. అలాగే పొటాషియం, మెగ్నీషియం వంటివి మన గుండెను కాపాడుతాయి. అందువల్లే సీతాఫలాలకు అంతలా డిమాండ్ పెరిగిపోయింది.

బీపీని కంట్రోల్ చేసే శక్తి కూడా సీతాఫలాలకు ఉందట.. ఈ పండ్లలోని విటమిన్ A మన చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.కంటి చూపు కూడా మెరుగవుతుంది. మలబద్ధకంతో బాధపడేవారు సీతాఫలం తింటే జీర్ణక్రియ బాగా అవుతుంది. ఈ ఫలంలోని కాపర్ మలబద్ధకాన్ని తరిమికొడుతుంది. డయేరియాకు చెక్ పెట్టే గుణం సీతాఫలానికి ఉంది. ఇలా చెప్పుకుంటే పోతే సీతాఫలాల ప్రయోజనాలు బోలెడున్నాయి.

ఇప్పుడు రైతుల లాబాల విషయానికి వస్తే.. ఇది కొందరి రైతులకు భారీగా ఆదాయాన్ని తెచ్చి పెడుతోంది. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఓ రైతు 6 ఎకరాల బంజరు భూమిలో సీతాఫలం సాగు చేశాడు. దీంతో 40 లక్షల వరకు సంపాదించినట్లు ఆయనే చెప్పాడు.

లాభాలు అధికంగా రావడంతో చాలామంది రైతులు సీతాఫల్‌ పంట పండిస్తున్నారు. జన్వాల్ గ్రామానికి చెందిన బాలకృష్ణ తనకున్న ఆరు ఎకరాల్లో సీతాఫలం సాగు చేశాడు. 2019 నుంచి ఉత్పత్తి ప్రారంభమైందని చెప్పారు. అతను ఎకరానికి 2.5 లక్షలు సంపాదించినట్లు వెల్లడించారు.. 2 లక్షల ఖర్చుతో ప్రారంభించిన ఈ పంటతో నేడు 15 లక్షలకు పైగానే ఆర్జిస్తున్నాడంతే ఎంత మంచివిషయం. ఇప్పటి వరకు 40 లక్షల లాభం పొందారట.

ఈ సీతాఫలాలను ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు ఇలా అన్ని రాష్ట్రాల మార్కెట్లలో విక్రయిస్తునట్లు రైతు తెలిపారు. సీతాఫల్‌ రకాల్లో ఎంకె 1 గోల్డెన్‌ ప్రత్యేకమైన పండు. ఈ పండు అందంగా కనిపించడమే కాదు తక్కువ నీటిలో రైతులు ఎక్కువ దిగుబడి సాధించవచ్చు. అంతేకాదు ఈ రకం జాతుల పండ్లు చాలా కాలం నిల్వ ఉంటాయట. ఒక్కోటి 400 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు ఉంటుంది.

మరాఠ్వాడాలోని ధరూర్, బాలాఘాట్ గ్రామాలు సీతాఫల్‌కు ప్రసిద్ధి. ప్రస్తుతం 25906 హెక్టార్ల విస్తీర్ణంలో విజయవంతంగా మొక్కలు నాటారు. ఆంధ్రప్రదేశ్‌లోని బాలానగర్ లేదా మముత్ జాతులు ఉత్పత్తి, నాణ్యత పరంగా మంచివిగా గుర్తించారు.ఈ పంటకు నీరు క్రమతప్పుకుండా కూడా ఏం అవసరం ఉండదు. వర్షపు నీటితోనే బంజరు భూమిలో సైతం ఇది పుష్కలంగా పండటంతో సొంతు భూములు ఉన్న రైతులు ఈ పంటను పండించేందుకు మొగ్గుచూపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news