బన్నీ, సుకుమార్ సినిమాలో మళ్ళి ప్రెసిడెంటే విలనా….??

-

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇకపోతే ఈ సినిమా తరువాత బన్నీ, సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇకపోతే ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోందని, అలానే హీరో మరియు హీరోయిన్లు ఇద్దరూ కూడా పక్కా మాస్ క్యారెక్టర్స్ లో నటిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో విలన్ గా జగపతి బాబు నటిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో నేడు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. వాస్తవానికి గతంలో సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమాలో ప్రెసిడెంట్ పాత్రలో నటించి మంచి పేరు సంపాదించిన జగపతిబాబు, ఇందులో కూడా ఒక మంచి మాస్ క్యారెక్టర్ లో దర్శనం ఇవ్వబోతున్నట్లు టాక్. ఇటీవల విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆయనతో పాటు జగపతిబాబుది కూడా కీ రోల్ అని సమాచారం.

 

జగపతిబాబు పాత్ర సినిమాలో ఎంతో వయొలెంట్ గా ఉంటుందని, తప్పకుండా రంగస్థలం మాదిరిగా ఈ సినిమా కూడా జగపతి బాబు కెరీర్ కి మంచి పేరు తీసుకురావడం ఖాయం అని యూనిట్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయట. జనవరి మొదటి వారంలో మొదటి షెడ్యూల్ జరుపుకోనున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం కనపడుతోంది. ఇప్పటికే బన్నీ, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఆర్య మంచి హిట్ అవ్వగా, ఆర్య 2 మాత్రం ఆశించిన రేంజ్ లో హిట్ కాలేదు. మరి వీరి కాంబినేషన్లో రాబోతున్న ఈ మూడవ సినిమా ఎంత మేర సక్సెస్ సాధిస్తుందో చూడాలి….!!

Read more RELATED
Recommended to you

Latest news