2022:ఈ ఏడాది ఎక్కువ పారితోషికం అందుకున్న హీరోయిన్స్ వీళ్లే..!

-

ప్రతి ఏడాది కూడా పదుల సంఖ్యలో హీరోయిన్లు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అయితే ఇందులో ఎవరు నిలదొక్కుకుంటారో.. ఎవరు దుకాణం సర్దేస్తారో చెప్పడం చాలా కష్టం. ఎవరు ఎంత కాలం కొనసాగుతారు అనేది వారు నటించే సినిమాల రిజల్ట్ ని బట్టి ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్లకు సాధారణంగానే లైఫ్ టైం చాలా తక్కువ . వాళ్ల నుండి ఎక్కువ కాల్ షీట్ లు కూడా దర్శకనిర్మాతల ఆశించరు. కేవలం పాటలకు , రొమాంటిక్ సన్నివేశాలకు మాత్రమే వీళ్లు కాల్ షీట్స్ ఇస్తే సరిపోతుంది. కాబట్టి వీళ్ళ పారితోషకాలు కూడా తక్కువగానే ఉంటాయి.

ఎప్పుడైతే కథకు ప్రాధాన్యత కలిగిన పాత్రలు చేస్తారో.. అప్పుడే వీళ్ళకి మంచి క్రేజ్ లభిస్తుంది. అలాగే పారితోషకం విషయంలో కూడా డిమాండ్ చేయడానికి వీలుంటుంది. అలా ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు పది సంవత్సరాల పైనే అవుతున్నా.. ఇంకా తమ హవా కొనసాగిస్తూ ఉండడం గమనార్హం. మరి 2022 సంవత్సరానికి గాను ఎవరు అత్యధికంగా పారితోషకం తీసుకున్నారు అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం.

నయనతార:
లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె వివాహం తర్వాత కూడా డిమాండ్ తగ్గలేదు. ప్రస్తుతం ఈమె చేతిలో ఆరు భారీ ప్రాజెక్టులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈమె ఈ ఏడాది రూ.15 కోట్ల భారీ పారితోషకం అందుకుంది.

రష్మిక:
ఈ ఏడాది ఐదు సినిమాలకు సైన్ చేసిన ఈమె ప్రస్తుతం రూ.10 కోట్ల పారితోషకం తీసుకుంటోందని టాక్.

పూజా హెగ్డే:
వరుస డిజాస్టర్ లు అవుతున్నప్పటికీ ఈమె క్రేజ్ ఎక్కడ తగ్గలేదు. ప్రస్తుతం వివిధ భాషలలో ఐదు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈమె దాదాపుగా 12 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటుందని సమాచారం.

కీర్తి సురేష్:
ప్రస్తుతం ఈమె నాలుగు సినిమాలకు సైన్ చేసింది. తెలుగులో కాకపోయినా ఇతర భాష సినిమాలలో బిజీగా ఉండడంతో ఈమె రూ. 10 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.

వీరితోపాటు మరికొంత మంది హీరోయిన్ లు ఈ ఏడాది అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news