త‌న స్ట‌యిల్‌పై త‌నే సెటైర్ వేసుకున్న రాజ‌శేఖ‌ర్‌..!

-

డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మెన్‌. ఆవేశ పాత్ర‌ల‌కి కేరాఫ్‌. ఆయనకు విజ‌యం దూర‌మై దాదాపు 11ఏండ్లు అయ్యింది. ఎవ‌డైతే నాకేంటి సినిమా త‌ర్వాత ఒక్క హిట్ కూడా రాలేదు. పైగా ఆయ‌న సినిమాలు క‌రెక్ట్ గా విడుద‌ల కాలేదు. కొన్ని వివాదాల‌య్యాయి. గ‌తేడాది ప్ర‌వీణ్ స‌త్తార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన పీఎస్‌వీ గ‌రుడ‌వేగ‌తో భారీ హిట్‌ని అందుకుని త‌న పున‌ర్‌వైభ‌వాన్ని సంపాదించుకున్నారు.

Actor rajashekar satire on his own style

ఆ స‌క్సెస్‌ని నిల‌బెట్టుకునేందుకు కెరీర్‌ని జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం అ! వంటి ప్ర‌యోగాత్మ‌క చిత్రాన్ని రూపొందించిన ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో క‌ల్కి పేరుతో ఓ న‌యా సినిమా చేస్తున్నారు. ఇది ప్రారంభం నుంచి ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్ సినిమాలో ఏదో ఉంద‌నే విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది. తాజాగా గురువారం మ‌హ‌ర్షి సినిమాతో రిలీజ్ చేసిన క‌మ‌ర్షియ‌ల్ ట్రైల‌ర్ మ‌రింత కొత్త‌గా ఉంద‌నిపిస్తుంది.

ఇందులో పార్ధా.. కర్మలను ఆచరించుటయందే నీకు అధికారము కలదు, కానీ వాటి ఫలితము పైన లేదు. నీవు కర్మఫలమునకు కారణం కారాదు. అలాగని కర్మలు చేయుట మానరాదు.. అంటూ ఓ సాధువు రాజశేఖర్‌తో చెబుతున్న డైలాగ్‌, దానికి రాజ‌శేఖ‌ర్ స్పందిస్తూ.. ఏం సెప్తిరి ఏం సెప్తిరి. ఎప్పుడూ ఇలాగే సెప్తారా.. అని వెటకారంగా అనడం కామెడీగా ఉంది.

ఇక చివ‌ర‌గా ప్ర‌తి సినిమాలో తాను డైలాగ్‌లు చెప్పేట‌ప్పుడు అనే హా..హా.. అని విల‌న్ చేత త‌నపై సెటైరిక‌ల్ గా అనిపించుకోవ‌డం ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. ఇందులో రాజశేఖర్‌ పోలీసు ఆఫీస‌ర్‌గా నటిస్తున్నారు. అదా శర్మ, నందితా శ్వేత క‌థానాయిక‌లుగా నటిస్తుండ‌గా, సి. కల్యాణ్‌, రాజశేఖర్‌ కుమార్తెలు నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో మ‌రో హిట్ ని త‌న ఖాతాలో వేసుకునేందుకు రాజ‌శేఖ‌ర్ రెడీ అవుతున్నార‌ని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news