రౌడీబాయ్ క్రేజ్ ఏంట్రా బాబూ.. ఢిల్లీ నుండి గ‌ల్లీ దాక అమ్మాయిలు ఫిదా

-

రౌడీ హీరో విజయ్ దేవరకొండ… ఈ పేరు ఓ సెన్సేషన్.. ఓ ట్రెండ్ సెట్టర్​.. యూత్​ ఫ్యాషన్​ ఐకాన్​.. తనదైన స్టైల్​లో నటిస్తూ… యువతలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్​ ఇమేజ్‌ను సృష్టించుకున్నాడీ లైగర్​ బాయ్​. జయాపజయాలతో సంబంధం లేకుండా కెరీర్‌లో వరుస సినిమాలు చేస్తూ… ముఖ్యంగా అమ్మాయిల గుండె లయగా మారాడు.

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్​నైట్​ స్టార్​గా ఎదిగిన ఇతడి నటనకు మాస్​ ప్రేక్షకులతో పాటు ఎంతో మంది అమ్మాయిలు ఫిదా అయిపోయారు. దేశ వ్యాప్తంగా యూత్​లో ఫుల్​ క్రేజ్​ పెరిగిపోయింది. ఆ సినిమాలో భగ్న ప్రేమికుడిగా విభిన్న నటనతో ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు. ముఖ్యంగా అమ్మాయిల మనసును కొల్లగొట్టాడు. ఇక ‘గీతా గోవిందం’తో సగటు అమ్మాయి కోరుకునే అబ్బాయిగా కనిపించి లేడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ మరింత పెంచుకున్నాడు. ఇప్పుడీ విజయ్‌ దేవరకొండకు అమ్మాయిల్లో విపరీతమైన క్రేజ్‌ పెరిగిపోయింది. స్టార్ హీరోయిన్లు, స్టార్ హీరోల డాటర్స్ కూడా ఈయనకు డై హార్డ్ ఫ్యాన్స్ గా మారిపోయారు. సోషల్​మీడియాలో ఎక్కడ చూసి అమ్మాయిలు.. ఇష్టమైన హీరో ఎవరంటే టక్కున విజయ్​దేవరకొండ పేరు చెప్పేస్తున్నారు. అతడి ఫొటలనే పోస్ట్ చేస్తున్నారు. తాజాగా, జరిగిన కొన్ని సంఘటనలు కూడా రౌడీబాయ్​కు ఉన్న లేడీ ఫ్యాన్​ ఫాలోయింగ్​కు అద్దం పడుతున్నాయి.

ఇటీవల కాఫీ విత్ కరణ్ షోకి గెస్టులుగా వెళ్లిన స్టార్ డాటర్స్ కమ్ హీరోయిన్స్.. జాన్వీ కపూర్-సారా అలీఖాన్​ కూడా విజయ్​మీద తమకున్న క్రష్​ ఫీలింగ్​ను బహిరంగంగా బయటపెట్టారు. కరణ్ జోహర్.. అడిగిన ప్రశ్నకు సిగ్గపడుతూ.. విజయ్​తో డేటింగ్​ చేయాలని ఉందని తమ మనసులోని మాటలను బయట పెట్టారు. అంతెందుకు ఆ మధ్య ఈ హీరో మీద తనకున్న ప్రేమను టాటూ రూపంలో చూపించింది ఓ యువతి. ఏకంగా తన వీపుపై విజయ్ దేవరకొండ ఫొటోను టాటూగా వేయించుకుంది. ఆ యువతి వీడియో నెట్టింట వైరల్‌గా కూడా మారింది. రౌడీ బాయ్​కు అమ్మాయిల ఫ్యాన్​ ఫాలోయింగ్​ ఎంత ఉందో చెప్పడానికే ఇదే నిదర్శనం.

కాగా, రవిబాబు తీసిన నువ్విలా చిత్రంలో సపోర్టింగ్ రోల్​తో పరిచయం అయ్యాడు రౌడీ బాయ్. ఆ తర్వాత లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ఎవడే సుబ్రమణ్యంలో సహాయ పాత్రలు పోషించి అందరి మెప్పు పొందాడు. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ రౌడీ హీరో… అర్జున్ రెడ్డి తో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిపోయాడు. అమ్మాయిల హృదయాల్లో ఒదిగిపోయాడు. గీతా గోవిందం సినిమాతో క్లాస్ ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత విజయ్ చాలా సినిమాలు చేశాడు. కానీ ఆ స్థాయిలో ఏ సినిమా రీచ్ కాలేకపోయింది. కొన్ని బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టాయి.

కానీ అతడి నటనకు, స్టైల్​కు అందరూ ఫిదా అయిపోయారు. ప్రస్తుతం అతడు పూరిజగన్నాథ్​ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్​తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇందులో బాక్సర్​గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక విజయ్ బోల్డ్ లుక్ అయితే హీరోయిన్స్​ను సైతం ఫిదా చేసింది. సమంత, అనుష్క, జాన్వీ లాంటి స్టార్ హీరోయిన్లు కూడా అతడిని ప్రశంసలతో ముంచెత్తారు. దీంతో పాటే పూరిజగన్నాథ్​ దర్శకత్వంలోనే మరో సినిమా, ఇక సమంతతో కలిసి ‘ఖుషి’ సినిమా చేస్తూన్నాడు. ఇక ఈ చిత్రాలన్నీ హిట్​ అయితే విజయ్​ క్రేజ్​ మరింత రెట్టింపు అవ్వడం ఖాయనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news