మళ్ళీ కొత్త వాళ్ళని పరిచయం చేయబోతున్న డైరెక్టర్ తేజ ..!

-

టాలీవుడ్ లో డైరెక్టర్ తేజ ది ఒక డిఫ్రెంట్ స్టైల్. ఆయన తెరకెక్కించే సినిమాల ద్వారా కొత్త నటీ నటులను ఇండస్ట్రీకి పరిచయం చేయడం వల్ల కాజల్ లాంటి బ్యూటి వచ్చి స్టార్ హీరోయిన్ అయింది. చిత్రం సినిమాతో ఉదయ్ కిరణ్, రీమా సేన్, నువ్వు నేను తో అనిత ..జయం సినిమాతో నితిన్..ఆ తర్వాత నవదీప్ లాంటి ఎంతో మంది ట్యాలెంటెడ్ హీరో హీరోయిన్స్ ని, క్యారెక్టర్ ఆర్టిస్టులను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశాడు.

 

అయితే గత కొంతకాలంగా స్టార్ హీరోలతో సినిమా తీస్తున్న తేజ కొత్త వాళ్ళ వైపు చూడలేదు. అయితే మళ్ళీ ఇప్పుడు ఆ ప్రయత్నాలు చేస్తున్నారట. ప్రస్తుతం తేజ రాక్షస రాజు రావణసురుడు- అలిమేలు మంగ వెంకట రమణ టైటిల్స్ తో రెండు సినిమాలని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలకి రానా.. గోపిచంద్ లని హీరోలుగా ఎంపిక చేసుకున్నారు.

అయితే ఈ రెండు సినిమాలలో ఇతర పాత్రలకి తేజ కాస్టింగ్ ఎంపిక చేసేందుకు సిద్ధమవుతున్నారు. టాలీవుడ్ లో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా పరిశ్రమకు కొత్త ప్రతిభను పరిచయం చేయడానికి లైవ్ ఆడిషన్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. చెప్పాలంటే ఇలాంటి ప్రయోగం ఇప్పటి వరకు మరే దర్శకుడు చేయలేదు. హెలో యాప్ లో అప్ లోడ్ చేసిన దరఖాస్తులు మాత్రమే తుది ఆడిషన్ కు తీసుకుంటామని తేజ క్లారిటీగా చెప్పారు. మరి తేజ సినిమాకి సెలెక్ట్ అయి టాలీవుడ్ కి పరిచయం అయ్యో ఆ లక్కీ పర్సన్స్ ఎవరో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news