Ajay Devgn: హిట్ సినిమాకు సీక్వెల్..రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన అజయ్ దేవగణ్

-

బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగణ్…తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ..RRR సినిమాలో కీలక పాత్ర పోషించి..ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు.. అజయ్ దేవగణ్..హిందీలో  ‘దృశ్యం’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. మలయాళం, తెలుగు భాషల్లో విజయవంతమైన ఈ పిక్చర్ ను హిందీలో రీమేక్ చేశారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ‘దృశ్యం-2’ను కూడా రీమేక్ చేశారు.

అభిషేక్ పాఠక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు, శ్రియా సరణ్, అక్షయ్ ఖన్నా, రజత్ కపూర్, ఇషితా దత్తా కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర విడుదల తేదీని తాజాగా అజయ్ దేవగణ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

ఈ ఏడాది నవంబర్ 18న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు అజయ్ దేవగణ్. మలయాళంలో ఈ సినిమాను కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ చేయగా, తెలుగులో విక్టరీ వెంకటేశ్ చేశారు. ఇతర భాషల్లో ఘన విజయం సాధించగా, హిందీలోనూ సూపర్ సక్సెస్ అవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Ajay Devgn (@ajaydevgn)

Read more RELATED
Recommended to you

Latest news