అక్కినేని అఖిల్ నుంచి అదిరిపోయే గిఫ్ట్..!

-

అక్కినేని ఫ్యాన్స్ కు ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ప్ర‌స్తుతం బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌` చిత్రం చేస్తున్న అఖిల్ ఈ చిత్రాన్ని సంక్రాంతి రేస్‌కి రెడీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అనీల్ సుంక‌ర నిర్మాణంలో అఖిల్ తన 5వ సినిమాను సూపర్ హిట్స్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోతున్నాడు. దీనికి సంబంధించి బిగ్ అనౌన్స్ మెంట్ బుధవారం ఉదయం 9‌:09:09 గంటలకి చేయబోతున్నారు.

ది బోర్న్ ఐడెంటిటీ ఆధారంగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో అఖిల్ గూఢ‌చారి పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు టాక్‌. 14 రీల్స్ ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్లో తెర‌కెక్కే ఈ సినిమాకు రు. 40 కోట్ల బ‌డ్జెట్ పెడుతున్నార‌ని తెలుస్తుంది. ఇకపోతే సురేంద్రరెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం మరో స్క్రిప్టుని రెడీ చేస్తున్నారట. రామ్ తాళ్లూరి నిర్మాతగా ఆ సినిమా తెరకెక్కించాలనే నిర్ణయంలో ఉన్నారట.

Read more RELATED
Recommended to you

Latest news