Allari Naresh: సరికొత్త పంథాకు ‘నాంది’..సెకండ్ ఇన్నింగ్స్‌లో అల్లరి నరేశ్ హవా

-

సినిమా పేరును తన ఇంటి పేరుగా మార్చుకున్న నటుడు ‘అల్లరి’ నరేశ్. ‘అల్లరి’ ఫిల్మ్ తోనే తన సినీ కెరీర్ స్టార్ట్ కాగా, అలా కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా కొన్నాళ్ల పాటు అల్లరి నరేశ్ ఉండిపోయారు. అలా చిత్రాలు చేసుకుంటూ సక్సెస్ అందుకుని కొంత కాలం పాటు ముందుకెళ్లిన నరేశ్..ఒకానొక దశలో ఇక విజయం అనేది లేక సతమతమైపోయాడు. వరుస సినిమాలు బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేకపోతున్న క్రమంలో నరేశ్ తన పంథా మార్చుకున్నారు.

గతంలో చేసిన ఎమోషనల్ రోల్స్ ప్లే చేయాలనుకున్నాడు. ‘గమ్యం’, ‘శంభో శివ శంభో’, ‘మహర్షి’ వంటి చిత్రాల ద్వారా తనలోని నటుడిని బయటకు తీసుకొచ్చిన నరేశ్..అటువంటి పాత్ర ద్వారా ప్రధాన పాత్ర పోషించాలనుకున్నాడు. అలా విజయ్ కనకమేడల అనే కొత్త దర్శకుడితో ‘నాంది’ అనే పిక్చర్ చేశారు. అలా సినీ కెరీర్ లో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు ఈవీవీ తనయుడు.

తనలోని నటుడిని వెతుక్కున్నాడే ఏమో తెలియదు. కానీ, ఇక సీరియస్ సినిమాలు చేయాలని డిసైడ్ అయిపోయారు. చాలా కాలం పాటు సక్సెస్ లు లేని నరేశ్ ‘నాంది’ చిత్రం సాధించిన విజయంతో ఆనంద భాష్పాలు కార్చారు. ఇక ఆ తర్వాత వెంటనే ‘నాంది’ దర్శకుడు కనకమేడల విజయ్ తో మరో సినిమా ఉంటుందని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే తన నెక్స్ట్ ఫిల్మ్ ‘సభకు నమస్కారం’ అనే పొలిటికల్ థ్రిల్లర్ చేస్తున్నారు. ఏ.ఆర్.మోహన్ దర్శకత్వంలో ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే సినిమా కూడా చేస్తున్నారు. అలా సెకండ్ ఇన్నింగ్స్ లో అల్లరి నరేశ్ వరుస సినిమాలతో తన హవా చూపనున్నారు. మొత్తంగా అల్లరి నరేశ్ వరుస సినిమాలతో ప్రజెంట్ ఫుల్ బిజీగా ఉన్నారని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news