AAA మల్టీప్లెక్స్ ప్రారంభించిన అల్లు అర్జున్.. ప్రత్యేకతలివే..!

-

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మళ్లీ వ్యాపారంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు రియల్ ఎస్టేట్ వంటి విషయాల్లో బిజీగా ఉన్న ఈయన ఇప్పుడు మల్టీప్లెక్స్ నిర్మాణంలో కూడా తన వంతు ప్రయత్నం మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఏషియన్ సంస్థతో కలిసి ఏషియన్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ ను ఏర్పాటు చేసిన అల్లు అర్జున్ తన థియేటర్లో మొదటిసారి రామాయణ ఇతిహాస ఆధారంగా తెరకెక్కిన ఆది పురుష్ సినిమాతో మల్టీప్లెక్స్ ను ప్రారంభించడం జరిగింది. ఇక ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా విడుదలైన నేపథ్యంగా AAA మల్టీప్లెక్స్ లో ఆది పురుష్ సినిమాతో ఓపెన్ చేయడం జరిగింది.

మరి ఈ మల్టీప్లెక్స్ యొక్క ప్రత్యేకత ఏంటి? అల్లు అర్జున్ హోదాకు తగ్గట్టుగా ఉంటుందా? అన్న విషయాలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఈ మల్టీప్లెక్స్ ప్రత్యేకతల విషయానికి వస్తే.. ఇందులో మొత్తం ఐదు స్క్రీన్లు ఉన్నాయి. 1350 సీట్ల సామర్థ్యంతో ఐదు స్క్రీన్ లలో ఒక స్క్రీన్ ఎల్ఈడి ది కావడం విశేషం. ఏ ఏ ఏ సినిమాస్ హాళ్లతో పాటు షాపింగ్ చేసుకోవడానికి కూడా మాల్స్ ఏర్పాటు చేశారు. అంతేకాదు ఇందులో గేమింగ్ కూడా అందుబాటులో ఉంది.

త్వరలోనే రెస్టారెంట్ కూడా ఇక్కడే ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇక ఈ మల్టీప్లెక్స్ నిర్మాణంలో నారాయణ, మురళీమోహన్, అల్లు అరవింద్ , ఎస్ సదానంద గౌడ్ భాగస్వాములైనట్లు సమాచారం. 2021 నవంబర్ నెలలో ఈ మల్టీప్లెక్స్ కి సంబంధించి అల్లు అర్జున్ చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ మల్టీప్లెక్స్ విభిన్నమైన తరహాలో ప్రేక్షకులను ఆకట్టుకుపోతోందని అన్ని రకాల ఫెసిలిటీస్ ని ఇక్కడ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఏది ఏమైనా అల్లు అర్జున్ చాలా అద్భుతంగా ప్లాన్ చేసి ఇది నిర్మించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news