ఏపీ ప్రభుత్వం చాలా బాగా పని చేస్తోంది – కేఎస్ భరత్

-

ఏపీ ప్రభుత్వం చాలా బాగా పని చేస్తోందని పేర్కొన్నారు టీమిండియా క్రికెటర్‌ కేఎస్ భరత్. సీఎం వైఎస్‌ జగన్‌ను కలిశారు ఇండియన్‌ క్రికెట్‌ ప్లేయర్‌ కేఎస్‌ భరత్‌. ఈ సందర్భంగా కేఎస్‌ భరత్‌ను అభినందించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. అనంతరం.. టీం సభ్యుల ఆటోగ్రాఫ్‌తో కూడిన జెర్సీని ముఖ్యమంత్రికి బహుకరించారు కేఎస్‌ భరత్‌.

ఈ సందర్భంగా కేఎస్‌ భరత్‌, మాట్లాడుతూ, ఇండియన్‌ క్రికెట్‌ టీంకు ఏపీ నుంచి మొదటగా ప్రాతినిధ్యం వహించడం, టెస్ట్‌ కేప్టెన్‌గా వ్యవహరించడం నాకు గర్వంగా ఉందని… ఈ విషయాలు సీఎంతో పంచుకున్నానని వివరించారు. ఆయన కూడా చాలా సంతోషంగా ఫీలయ్యారని.. మద్దతు కావాలని అడిగానని చెప్పారు. దేశం గర్వపడేలా రాష్ట్ర పేరు ప్రతిష్టలు నిలబెట్టాలని సీఎం జగన్ సూచించారని.. ఏపీలో మౌలిక వసతులు బాగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు.ఏపీలో స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బావుందని.. క్రీడాకారులకు ఏపీ ప్రభుత్వం చాలా ప్రోత్సాహం అందిస్తోందని అన్నారు. ఈ ప్రోత్సాహం వల్ల నాలాంటి క్రీడాకారులు మరింతగా వెలుగులోకి వస్తారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news