జ‌వ‌న‌రి 12న బ‌న్నీ వ‌ర్సెస్ మ‌హేష్ … ఈ పంతం వెన‌క ఏం జ‌రిగింది…

-

2020 సంక్రాంతికి విడుదలకాబోయే సినిమాల జాబితాలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ యొక్క ‘అల వైకుంఠపురములో’, మహేష్ బాబు, అనిల్ రావిపూడిల ‘సరిలేర నీకెవ్వరు’ సినిమాల రిలీజ్ డేట్లు క‌న్‌ఫార్మ్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు జనవరి 12న విడుదలకానున్నాయి. దీంతో వ‌చ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ వార్ ఎంత‌లా హీటెక్క‌నుందో క్లారిటీ వ‌చ్చేసింది. రెండు సినిమాలు ప్రెస్టేజియ‌స్ కాంబినేష‌న్లోనే తెర‌కెక్కుతున్నాయి.

భారీ బ‌డ్జెట్‌, భారీ ప్రి రిలీజ్ బిజినెస్‌లు.. పైగా రెండు సినిమాలు ఒకే రోజు అంటే ఎంత మంచి టాక్ వ‌చ్చినా ఓపెనింగ్స్‌పై తీవ్ర‌మైన ప్ర‌భావం ఉంటుంది. క‌నీసం నాలుగైదు రోజుల గ్యాప్ ఉంటే ఓపెనింగ్స్ రెండు సినిమాల‌కు బాగా వ‌స్తాయి. రెండు సినిమాల్లో ఏ ఒక్క సినిమాకు నెగిట‌టివ్ టాక్ వ‌చ్చినా ఆ సినిమా ఖ‌చ్చితంగా దెబ్బ‌తింటుంది. కానీ రెండు సినిమాల నిర్మాత‌లు ఫుల్ కాన్ఫిడెంట్‌తో ఉన్నారు.

అల వైకుంఠ‌పురంలో నిర్మాత‌లు త‌మ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ అంటున్నారు. అటు స‌రిలేరు నీకెవ్వ‌రు టీం కూడా అంతే కాన్పిడెంట్‌తో ఉంది. ఈ రెండు సినిమాల రిలీజ్‌డేట్లు అధికారికంగా పోస్ట‌ర్ల‌తో స‌హా రిలీజ్ చేయ‌డంతో సంక్రాంతి పుంజులు ఎలా త‌ల‌ప‌డుతున్నాయో చెప్ప‌క‌నే చెప్పేశాయి. ఇక కేవ‌లం ఈ ఇద్ద‌రు హీరోల‌తో పాటు నిర్మాత‌లు పంతానికి పోవ‌డం వ‌ల్లే ఇద్ద‌రు ఒకే రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న‌ట్టు స‌మాచారం.

ముందుగా బ‌న్నీ సినిమా 12న అనుకుంటే, మ‌హేష్ 11న రావాల‌నుకున్నాడు. మ‌హేష్ సినిమా మేక‌ర్స్ క‌నీసం రెండు రోజుల గ్యాప్ అడిగినా బ‌న్నీ సినిమా మేకర్స్ కుద‌ర‌ద‌న్నారు. చివ‌ర‌కు ఇది అటు ఇటూ అయ్యి ఎవ్వ‌రూ కాంప్ర‌మైజ్ అయ్యే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో ఇగోల‌కు పోయి ఇద్ద‌రు జ‌న‌వ‌రి 12నే వ‌స్తున్నారు. మ‌రి ఈ వార్లో ఎవ‌రిది పైచేయి అవుతుందో ?  చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news