ఎట్టకేలకు తన సినిమాని విడుదల చేయబోతున్న అల్లు శిరీష్..!!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా అల్లు అరవింద్ మంచి పేరు సంపాదించారని చెప్పవచ్చు. ఈయన కుమారులు అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు బాబి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇందులో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా పేరు పొందారు. అయితే అల్లు శిరీష్ మాత్రం తను నటించిన సినిమాలు ఇప్పటివరకు ఏ ఒక్కటి కూడా విజయం సాధించలేదు. ఇక అల్లు బాబి అయితే ప్రముఖ నిర్మాతగా కూడా పలు సినిమాలకు వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే అల్లు శిరీష్ ఎన్నో సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన ఒక సినిమా ఇప్పుడు విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం.

అల్లు శిరీష్ నటించిన చిత్రం ప్రేమ కాదంట ఈ సినిమాలో నటించబోతున్నారని దాదాపుగా మూడు సంవత్సరాల క్రితమే ఈ సినిమాని ప్రకటించడం జరిగింది. ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన అను ఇమ్మానుయేల్ జంటగా నటిస్తున్నది. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లుగా కూడా వార్తలు వినిపించాయి అయితే ఈ విషయంపై ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. తాజాగా ఈ సినిమా నుంచి అధికారికంగా ప్రకటన వెలుబడినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం నవంబర్ 4వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్రగుండం క్లారిటీ ఇవ్వడం జరిగింది.

గత కొన్ని నెలలుగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తూనే ఉంది. ఇప్పటికీ సినిమా పూర్తి అయ్యి చాలా కాలం కాలమైంది. అల్లు శిరీష్ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వచ్చే నెల నుంచి మొదట పెట్టబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో హీరోయిన్ పాల్గొంటుందా లేదా అనే విషయం ఇప్పుడు అందరిలోనూ ఆసక్తికరంగా మారుతుంది. ఒకవేళ హీరోయిన్ హాజరయ్యిందంటే అల్లు శిరీష్, హీరోయిన్ మధ్య ఏదో ఉందని వార్తలు బలాన్ని చేకూరుస్తుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమాతో అల్లు శిరీష్ సక్సెస్ అవుతారు లేదో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news