మళ్లీ కెలికిన అనసూయ.. ఈసారి ఏకంగా వాళ్ళని టార్గెట్ చేస్తూ..!

-

బుల్లితెర యాంకర్ గా గ్లామర్ బ్యూటీగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న అనసూయ అనతి కాలంలోనే భారీ పాపులారిటీ దక్కించుకుంది. అలాగే సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె తాజాగా పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉంది. ఈ సినిమా గనుక మంచి విజయం సాధిస్తే అనసూయ క్రేజ్ మరో లెవెల్ కి వెళుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే సినిమాలు, బుల్లితెర షోల ద్వారా ప్రేక్షకులను బాగానే అలరిస్తున్న ఈమె అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చేసే కామెంట్ల వల్ల ట్రోల్స్ కి గురి అవుతూ ఉంటుంది.

ఇక నిత్యం ఏదో ఒక కోణంలో హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉండే ఈమె ఎప్పుడైతే విజయ్ దేవరకొండ పేరు ముందు “ది” అని పెట్టడాన్ని తప్పు పడుతూ పరోక్షంగా అనసూయ ట్వీట్ పెట్టిందో అప్పటి నుంచి నెట్టింట దుమ్ము దుమారం కొనసాగుతోంది. విజయ్ దేవరకొండ సమంత హీరో హీరోయిన్గా తాజాగా నటిస్తున్న చిత్రం ఖుషి.. ఈ సినిమా విషయంలోనే ఆమె వేలు పెట్టింది.. విజయ్ దేవరకొండ పేరు ముందు ది అని పెట్టడంతో దీనిని ఆమె తప్పు పట్టింది. విజయ్ దేవరకొండ పేరు ప్రస్తావించకుండా ఇన్ డైరెక్ట్ గా కామెంట్లు చేసింది. దీంతో విజయ్ దేవరకొండ అభిమానులు ఆమెను ఒక రేంజ్ లో ట్రోల్ చేశారు.

అయితే ఈమె ఊరుకుంటుందా.. తనదైన శైలిలో తాజాగా ఒక వీడియోని విడుదల చేసి మళ్లీ కెలికిందని చెప్పాలి. ఈసారి యూట్యూబ్ ఛానల్స్, వెబ్సైట్ మీద మండిపడుతూ ఈమె చేసిన కామెంట్లు కొత్త చర్చకు తెరలేపాయి.. సెలబ్రిటీల మీద వార్తలు రాసి కడుపు నింపుకునే మీకు ధైర్యం ఉంటే.. ఉప్పు కారం తింటుంటే నిజాలు రాయండి.. నేను నిజం మాట్లాడాను.. నా అభిప్రాయం తెలియజేశాను అంటూ బీభత్సమైన ఆటిట్యూడ్ తో కామెంట్లు చేయడం ఇప్పుడు మరింత వైరల్ గా మారుతుంది.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news