“మై డియర్ రాజా” రాజీవ్ కనకాల గురించి సుమ ట్వీట్..!

-

బుల్లితెరపై ఎంతమంది యాంకర్లు ఉన్నా సుమ స్థానం వేరు. టాలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ యాంకర్‌ ఎవరు అని ఆడగానే ఆలోచించకుండా చెప్పేసే పేరు సుమది. ఏ టీవీ రియాలిటీ షో అయినా, సినిమా వేడుకైనా ఆమెకే మొదటి ఛాయిస్. ఆమె కాదంటేనే వేరే యాంకర్ల విషయం ఆలోచిస్తారంటే అర్ధం చేసుకోవచ్చు ఆమెకు ఎంత క్రేజ్ ఉందో. అయితే తాజాగా.. రాజీవ్ కనకాల గురించి సుమ చేసిన ట్వీట్ ఒకటి అందరినీ ఆకట్టుకుంటోంది.

తన భర్త చేతిని పట్టుకుని, ఆయన భుజంపై తలవాల్చిన ఫొటోను షేర్ చేసి ‘మై డియర్ రాజా…ఎప్పటికీ నా సంతోషం నీవే’ అని సుమ ట్వీట్ చేశారు. మరోవైపు రాజీవ్, సుమ విడిపోయినట్టు మధ్య పుకార్లు వచ్చాయి. తాజాగా జరిగిన ఓ కార్యక్రమం ద్వారా అలాంటిదేమీ లేదని స్పష్టం అయింది. ఈ నేపథ్యంలో సుమ చేసిన ట్వీట్ అభిమానులను అలరిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news