పవన్, త్రివిక్రం చూసి ఒప్పుకోలేదు

-

మళయాళ పరిశ్రమ నుండి వచ్చి ఇక్కడ సత్తా చాటుతున్న భామల్లో అను ఎమ్మాన్యుయెల్ ఒకరు. నాచురల్ స్టార్ నాని మజ్ను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అను ఎమ్మాయుయెల్ ఆ తర్వాత వరుస స్టార్స్ అవకాశాలను అందుకుంది. పవన్, త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా కూడా చేసిన ఈ అమ్మడు ఆ సినిమా ఫెయిల్యూర్ తో చాలా వెనుకపడ్డది. ఆ తర్వాత వచ్చిన నా పేరు సూర్య కూడా ఫ్లాప్ అవడంతో అమ్మడికి ఐరన్ లెగ్ అన్న ముద్ర వేశారు.

అయితే అజ్ఞాతవాసి పవన్, త్రివిక్రం కాంబినేషన్ లో మూవీ కాబట్టి ఒప్పుకోలేదని. అత్తారింటికి దారేది సినిమాలో ప్రణీత రోల్ లాగా క్లిక్ అవుతుందని అనుకున్నా అంటుంది అను. లేటెస్ట్ గా నాగ చైతన్య హీరోగా మారుతి డైరక్షన్ లో శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో నటించింది అను ఎమ్మాన్యుయెల్. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అజ్ఞాతవాసి అనుభవాలను పంచుకుంది.

అంతేకాదు తను చాలా బోల్డ్ గా ఉంటానని.. అలాంటి రోల్స్ వచ్చినా చేసేందుకు తాను రెడీ అంటుంది. అవకాశాలు లేవు కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చి దర్శక నిర్మాతలను ఎట్రాక్ట్ చేయాలని చూస్తుందని అంటునారు కొందరు. ఫైనల్ గా అమ్మడి ఆశలన్ని అల్లుడు సినిమా మీదే పెట్టుకుంది. అది కూడా తుస్సుమంటే ఇక అను పెట్టా బేడా సర్ధేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news