ఆమె ఫ్యూచర్ తేలిపోతుంది

-

నాని మజ్ను సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మళయాళ భామ అను ఇమ్మాన్యుయెల్ ఒకటి రెండు సినిమాలు హిట్ కొట్టినా ప్రస్తుతం అమ్మడు రేసులో వెనుకపడి ఉంది. పవర్ స్టార్ అజ్ఞాతవాసి, స్టైలిష్ స్టార్ నా పేరు సూర్య సినిమాలు అమ్మడు ఫేట్ ని మార్చలేకపోయాయి. ప్రస్తుతం అమ్మడు నాగ చైతన్య సరసన శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో నటిస్తుంది. ఈ నెల చివరన ఆ సినిమా వస్తుంది.

అను ఆశలన్ని ఈ సినిమా మీదే పెట్టుకుందట. ఇది హిట్ అయితేనే డిస్కషన్స్ లో ఉన్న సాగర్ చంద్ర, వరుణ్ తేజ్ సినిమాతో పాటుగా నితిన్, వెంకీ కుడుముల మూవీకి ఆమెను తీసుకుంటారట. మరి అను ఫేట్ మార్చేయబోతున్న శైలజా రెడ్డి అల్లుడు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. మారుతి డైరక్షన్ లో సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది. సో అమ్మడి లక్ ఎలా ఉండబోతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news