`ఏ మాయ చేసావె` సీక్వెల్ రాబోతోంది.. హీరోయిన్‌గా అనుష్క‌..?

-

దాదాపు ఎనిమిదేళ్ల క్రితం గౌత‌మ్ మీనన్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `ఏమాయ చేశావే` సినిమా తెలుగు ప్రేక్ష‌కుల‌ను మాయ‌లో ప‌డేసింది. ఈ సినిమా వ‌ల్లే నాగ‌చైత‌న్య‌, స‌మంత స్టార్‌లుగా ఎదిగారు. ఇదే సినిమాను త‌మిళంలో `విన్నైతాండి వ‌రువాయ‌`గా గౌత‌మ్ మీనన్ ముందుగా తెర‌కెక్కించారు. త‌మిళంలో కూడా మంచి విజ‌యాన్ని అందుకుంది. వాస్త‌వానికి తెలుగు .. తమిళ భాషల్లో దర్శకుడిగా గౌతమ్ మీనన్ కి మంచి పేరు వుంది. ప్రేమకథా చిత్రాలను చక్కని ఫీల్ తో తెరకెక్కించడం ఆయన ప్రత్యేకత. ఈ క్ర‌మంలోనే ‘విన్నైతాండి వరువాయ’ సినిమా భారీ విజయాన్ని సాధించింది. శింబు కథానాయకుడిగా నటించిన ఆ సినిమాలో కథానాయికగా త్రిష సందడి చేసింది.

ఇక ‘విన్నైతాండి వరువాయ’తో పోలిస్తే దాని తెలుగు వెర్షన్ ‘ఏమాయ చేసావె’ ముగింపు భిన్నంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తమిళంలో హీరో హీరోయిన్లు చివరికి కలవరు. కానీ, తెలుగులో మాత్రం నాగ‌చౌత‌న్య, స‌మంత క‌లిసిపోతారు. ఇక ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే.. తమిళంలో ఒరిజినల్ వెర్షన్ కి సీక్వెల్ చేయాలనే నిర్ణయానికి గౌతమ్ మీనన్ వచ్చాడు. ‘విన్నైతాండి వరువాయ 2’కి కథను కూడా సిద్ధం చేశార‌ట‌. శింబు ఓకే అనాలేగానీ సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధంగా వున్నాను’ అని ఆయన అన్నాడు. ఈ సినిమాలో శింబు జోడీగా ఆయన అనుష్కను తీసుకోవాలని అనుకుంటున్నాడట. ఇక తెలుగులోను సీక్వెల్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news