రణబీర్-దీపిక విడిపోనున్నారా.. నిజమేనా..?

-

బాలీవుడ్ లో క్యూట్ కపుల్ గా పేరుపొందారు రణవీర్ సింగ్.. దీపిక పదుకొనే.. ఇదిలా ఉండగా తమ వివాహ బంధానికి స్వస్తి చెబుతున్నారని వార్తలు చాలా వైరల్ గా మారుతున్నాయి. నాలుగేళ్ల వివాహ బంధానికి విడాకులతో పుల్ స్టాప్ పెట్టబోతున్నారని వార్తలు ఈ మధ్యకాలంలో తరచూ వినిపిస్తున్నాయి. ఇక వీరిద్దరూ 2018లో ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఇలా వివాహమైన నాలుగేళ్లకి వీరిద్దరూ విడిపోతున్నారంటూ బాలీవుడ్లో వార్త వైరల్ కావడంతో వీరి అభిమానుల సైతం ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. కొన్ని మీడియా కథనాల ప్రకారం వీరిద్దరూ కొద్దిరోజులుగా దూరంగా ఉంటున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

అయితే వీరిద్దరూ మధ్య గ్యాప్ పెరగడానికి ముఖ్య కారణం రణవీర్ చేసిన న్యూడ్ ఫొటోస్ అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరి విడాకుల వ్యవహారాన్ని క్రిటిక్ ఉమైర్ సందు కూడా సమర్థించారు. ఇక వీరిద్దరి మధ్య రిలేషన్ చెడిపోయిందని త్వరలోనే విడాకులు ప్రకటన రాబోతున్నట్లుగా కూడా తన ట్విట్టర్ నుంచి తెలియజేశారు. దీంతో ఈ విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది. ఇక అంతే కాకుండా దీపికా పదుకునే వేలికి రణబీర్ తొడిగిన ఉంగరం కూడా కనిపించలేదని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక దీపికా పదుకొనే తన తల్లి ఉజ్జలకూడా ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. కానీ వీరి వెంట రణబీర్ కపూర్ కనిపించలేదు. దీంతో ఈ విషయానికి మరింత బలం చేకూర్చిందని చెప్పవచ్చు. అయితే ఈ విషయాన్ని దీపిక పదుకొనే, రణవీర్ కానీ ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ కొంతమంది మాత్రం ఇవన్నీ ఒక కట్టుకథలే అన్నట్లుగా కామెంట్ చేస్తున్నారు. గతంలో కూడా ఒకసారి దీపిక పదుకొనే ఒక ఇంటర్వ్యూలో మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు.. మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నామని తెలియజేశారు. ఇక అంతే కాకుండా పిల్లల కోసం కూడా ట్రై చేస్తున్నామని తెలియజేసినట్లుగా సమాచారం. మరి ఈ విషయంపై దీపికా పదుకొనే కానీ రణవీర్ కానీ క్లారిటీ ఇస్తే బాగుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news