అర్జున్ రెడ్డి మరో రీమేక్ డైరెక్టుగా ఓటీటీలోకే..

-

విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రం ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ స్టార్ గా మారిపోయాడు. దర్శకుడు సందీప్ వంగాకి బాలీవుడ్ లో అవకాశం వచ్చింది. కబీర్ సింగ్ పేరుతో బాలీవుడ్ లో రీమేక్ అయిన ఈ చిత్రానికి కలెక్షన్ల వర్షం కురిసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ చిత్రాన్ని తమిళంలో ఆదిత్య వర్మగా రీమేక్ అయ్యింది.

హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ ఇందులో హీరోగా నటించాడు. కొత్త దర్శకుడు గిరీశాయ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి తమిళంలోనూ మంచి స్పందన వచ్చింది. ఐతే నిజానికి ఈ సినిమాని తమిళంలో రీమేక్ చేయాలని భావించినపుడు దర్శకుడు బాలాని సంప్రదించారు. బాలా ఈ చిత్రాన్ని వర్మ పేరుతో తెరకెక్కించాడు. కానీ ఈ సినిమా రిలీజ్ కాలేదు. కొన్ని కారణాల వల్ల మళ్ళీ ఈ రీమేక్ ని గిరీశాయ దర్శకుడితో తెరకెక్కించారు.

ఐతే బాలా తెరకెక్కించిన వర్మ ప్రస్తుతం ఓటీటీలో విడుదలకి సిద్ధం అవుతోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చింది. సింప్లీ సౌత్ అనే యాప్ ద్వారా బాలా దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి రీమేక్, వర్మ చిత్రం అక్టోబర్ 6వ తేదీ నుండి అందుబాటులో ఉండనుంది.

Read more RELATED
Recommended to you

Latest news