భాను శ్రీని ట్రోల్ చేస్తూ వీడియో షేర్ చేసిన అషూ రెడ్డి..!

-

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ విషయం ఎలా వైరల్ అవుతుందో చెప్పడం చాలా కష్టం. ఒకవేళ అయితే మాత్రం సూపర్ లక్కే.. డబ్ స్మాష్ ,టిక్ టాక్ వీడియోలు, రీల్స్ ద్వారా భారీ పాపులారిటీ అయిన వాళ్ళను కూడా చాలామందిని చూశాం. ఈమధ్య కాలంలో అలా పాపులర్ అయిన వారిలో భాను శ్రీ పాడిన పాట కూడా ఒకటని చెప్పాలి.. పవన్ కళ్యాణ్ తీన్మార్ సినిమాలోని “గెలుపు తలుపులే తీసే” అనే పాటను భాను పాడినప్పటి నుండి నెట్టింట ఈ వీడియో బాగా ట్రెండ్ అవ్వడంతో పాటు దాన్ని బేస్ చేసుకొని క్రియేట్ చేసిన మీమ్స్ అయితే మాత్రం ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

ఫన్నీ మీమ్స్ చేసేవాళ్లు తమ క్రియేటివిటీని యాడ్ చేసి నెట్టింట మరీ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అషూ రెడ్డి కూడా భాను శ్రీని ట్రోల్ చేయడం మొదలుపెట్టింది. ఎంతలా అంటే అలా ఇలా కాదు ఏకంగా వీడియో పోస్ట్ చేసి మరి హంగామా చేసింది. అసలు విషయంలోకెళితే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ తర్వాత ఆ రేంజ్ లో ఫేమస్ అయిన షో అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ మాత్రమే చెప్పాలి . ఇందులో కమెడియన్లతో , యాంకర్లు , టీవీ ఆర్టిస్టులు అందరూ కూడా కనిపిస్తుంటారు. అందుకు తగ్గట్లే ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు.రీసెంట్ గా జరిగిన ఎపిసోడ్లో నటి భాను శ్రీ తీన్మార్ సినిమాలోని గెలుపు తలుపులే తీసే అనే పాట పాడింది. ఈ పాట పాడిన తర్వాత జడ్జి ఇంద్రజ కూడా పాటలో డెప్త్ వుందని చెప్పింది. దీంతో ఈ విషయాన్ని పట్టేశారు మీమర్స్.. ఇక చూసుకోండి అప్పటినుంచి భాను పై ట్రోలింగ్ మొదలైంది.

లేటెస్ట్ మీమ్స్ తో నెటిజన్లను భలే ఆకట్టుకున్నారు. ఇప్పుడు అషూ రెడ్డి కూడా రంగంలోకి దిగింది. ఈ సాంగ్ మీద ఏకంగా ఒక వీడియో చేసి నెట్టింట వదిలింది. నీ ఎనర్జీని ఎవరు మ్యాచ్ చేయలేరు అంటూ భాను శ్రీని ట్యాగ్ చేసింది. దీన్ని బట్టి చూస్తే అషూ భానుని కావాలనే ఫన్నీగా ట్రోల్ చేసిందని నెగిటివ్గా అనుకోవడానికి ఏం లేదని కూడా అర్థమవుతుంది. మొత్తానికి అయితే ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

Read more RELATED
Recommended to you

Latest news