ప్రభాస్ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న భాగ్యశ్రీ ఇప్పటికే కీలక సన్నివేశాలు చిత్రీకరణ ..!

-

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం జాన్. ప్రస్తుతానికి ఇది వర్కింగ్ టైటిల్ గా అనుకుంటున్నారు. అంతేకాదు రాధే శ్యాం అన్న టైటిల్ ని పరిశీలిస్తున్నారు చిత్ర బృందం. ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. ప్రభాస్ గత చిత్రం సాహో బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దాంతో మరోసారి ప్రభాస్ సినిమాని హిందీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లే ఉద్దేశ్యంతో కొంతమంది బాలీవుడ్ నటులను ఈ సినిమాలో తీసుకున్నారు.

 

అందులో భాగంగానే ఒకప్పటి స్టార్ హీరోయిన్ భాగ్యశ్రీని నటింపజేస్తున్నట్లు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ 20 చిత్రం గురించి మీడియాలో వచ్చిన పలు పుకార్ల వల్ల భాగ్యశ్రీ వార్తలను పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈ చిత్రంలో కీలక పాత్రలో భాగ్యశ్రీ నటిస్తున్న మాట వాస్తవమే. ఆమె స్వయంగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలిపింది.

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ సల్మాన్ ఖాన్ మైనే ప్యార్ కియా సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది భాగ్యశ్రీ. ఆ తర్వాత బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అయితే గత కొన్నేళ్ళుగా సినిమాలకి దూరంగా ఉన్న భాగ్యశ్రీ ప్రభాస్ సినిమాలో నటిస్తుండటం విశేషం. ఇక రీసెంట్ గా ప్రభాస్-భాగ్యశ్రీ ల మీద కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించాడు దర్శకుడు రాధాకృష్ణ కుమార్.

Read more RELATED
Recommended to you

Latest news