బోయపాటి దెబ్బకు బాలయ్య నిర్మాతకు మైండ్ బ్లాక్….??

-

గత ఏడాది రామ్ చరణ్ తో వినయ విధేయ రామ అనే సినిమాని తీసి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న మాస్ దర్శకుడు బోయపాటి, ఆ తరువాత తన తదుపరి సినిమా కోసం ఎంతో గ్యాప్ తీసుకున్నారు. ఇక ఎట్టకేలకు తన తదుపరి సినిమాని బాలయ్యతో తీయడానికి ఫిక్స్ అయిన బోయపాటి, ఇటీవల ఆ సినిమా అధికారిక పూజ కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. నిజానికి ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, మరోవైపు బాలయ్య తన రాజకీయ వ్యవహారాలతో బిజీగా ఉండడంతో కొంత వాయిదా పడిందట.

ఇకపోతే ఈ సినిమాకు ముందుగా రూ.50 కోట్ల లోపు బడ్జెట్ ని అనుకోడవం జరిగిందని, అయితే కథలో కొద్దిపాటి మార్పులతో పాటు సినిమాలోని కొన్ని కీలక సీన్స్ ని కాంప్రమైజ్ కాకుండా తీయాలని బోయపాటి సంకల్పించడంతో సినిమా యొక్క ఖర్చు రూ.80 కోట్లవరకు చేరే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఒక్కసారిగా అంత భారీ మొత్తంలో సినిమా ఖర్చుని బోయపాటి శ్రీను పెంచేయడంతో, ఈ సినిమా నిర్మాత అయిన మిరియాల రవీందర్ రెడ్డి కొంత ఆలోచనలో పడ్డారని అంటున్నారు.

 

వాస్తవానికి సినిమాకి ఎంత భారీ ఖర్చు పెట్టడానికయినా సిద్దమే అని, అలానే సినిమా సక్సెస్ అయితే ఆ ఖర్చు అతి త్వరగానే రికవర్ అవుతుందని, కానీ ఏ మాత్రం తేడా కొట్టినా సినిమాని కొనుగోలు చేసిన బయ్యర్లకు అది చెడు చేస్తుందని నిర్మాత ఆలోచిస్తున్నాడట. అయితే స్క్రిప్ట్ మీద తనకు మంచి నమ్మకం ఉందని, తప్పకుండా బాలయ్యతో తాను తీస్తున్న ఈ మూడవ సినిమాతో తమ ఇద్దరి కాంబోలో హ్యాట్రిక్ విజయాలు అందుకోవడం ఖాయం అని బోయపాటి భావిస్తున్నట్లు చెప్తున్నారు…..!!

Read more RELATED
Recommended to you

Latest news