Sarkaru Vari Pata: ‘సర్కారు వారి పాట’ సెన్సార్ పూర్తి..సినిమా నిడివి ఎంతంటే?

-

‘గీతా గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ పిక్చర్ తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఫిల్మ్ కు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ విషయమై ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ వేదికగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు.

ఈ నెల 12న విడుదల కానున్న మూవీ నిడివి 162 నిమిషాల 25 సెకన్లు ఉందని వివరించారు. హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఎస్.ఎస్.థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘కళావతి, పెన్నీ, మ.మ..మహేశా, సర్కారు వారి పాట టైటిల్ సాంగ్’ సినీ లవర్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

సినిమా డెఫినెట్ గా బ్లాక్ బాస్టర్ అవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో థియేటర్ల వద్ద అభిమానుల సందడి షురూ అయింది.

ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నిటినీ ఈ చిత్రం తిరగరాస్తుందని మహేశ్ -కృష్ణ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మహేశ్ బాబు తెలుగు ప్రేక్షకులకు చివరగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో కనిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news