మ‌రో మెగా మ‌ల్టీస్టార‌ర్.. మ‌ల‌యాళ రీమేక్‌

-

సాధార‌ణంగా తెలుగులో మల్టీ స్టారర్ సినిమాలు చేయడమే ఓ సాహసం. అయితే మెగాస్టార్ చిరంజీవి, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ మ‌రోసారి వెండితెర‌పై అభిమానుల‌కు క‌నువిందు చేయ‌నున్నార‌ని స‌మాచారం. ఇప్ప‌టికే `మ‌గ‌ధీర‌`, `ఖైదీ నంబ‌ర్ 150` చిత్రాల్లో చిరు, చ‌ర‌ణ్ క‌నిపించి మెగాభిమానులను మెప్పించారు. ఇక మ‌రో సారి `లూసిఫ‌ర్‌`రీమేక్ చేయ‌బోతున్నార‌ట‌. మల‌యాళ సూపర్‌స్టార్ మోహ‌న్‌లాల్ హీరోగా న‌టించిన చిత్రం `లూసిఫ‌ర్‌`. ఈ చిత్రం చాలా పెద్ద విజ‌యాన్ని ద‌క్కించుకుంది. హీరో పృథ్వీరాజ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌డ‌మే కాకుండా కీల‌క పాత్ర‌లో న‌టించారు.

అయితే ఈ సినిమా రీమేక్ హ‌క్కుల‌ను రామ్‌చ‌ర‌ణ్ ద‌క్కించుకున్నార‌ని పృథ్వీరాజ్ తెలియ‌జేశారు. ఇక ‘సైరా’ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో 152వ చిత్రంగా చిరంజీవి చేయనున్నారు. దీని త‌ర్వాతే `లూసిఫ‌ర్` రీమేక్ తెర‌కెక్కుతుందట‌. మోహ‌న్ లాల్ పాత్ర‌లో చిరంజీవి, పృథ్వీరాజ్ పాత్ర‌లో రామ్‌చ‌రణ్ న‌టిస్తార‌ని టాక్‌. అన్నీ అనుకున్న‌ట్లు కుదిరితే ఇప్పుడు `లూసిఫ‌ర్` రీమేక్‌లోనూ ఇద్ద‌రు క‌లిసి న‌టిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news